దాంతో సిద్ధార్థ ఆకలి వేస్తుంది అని చెప్తే వినోద్ జూలియట్ నీ టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పి బయటకు వెళ్లాడు జూలియట్ వచ్చిన తర్వాత తనకు బెడ్ కింద ఒక బ్లాక్ బ్యాగ్ ఉంది దాని బాత్రూమ్ లో పెట్టామని చెప్పి జూలియట్ జడ లో క్లిప్ తీసి పక్కన పెట్టి టిఫిన్ తింటున్నట్టు నటిస్తూ జూలియట్ వెళ్లిపోవగానే తన handcuffs విడిపించుకొని తన బెడ్ కింద నుంచి కింద cargo లోకి వెళ్లి flight cargo door తెరిచి బాత్రూమ్ లో ఉన్న ప్యారాచూట్ తో కిందకి దూకి తప్పించుకున్నాడు సిద్ధార్థ అప్పుడు cargo door తెరుచుకోని ఉండటం తో మధు కీ అర్థం అయ్యింది వాడు తప్పించుకున్నాడు అని అప్పుడు రాడార్ ప్రకారం వాళ్లు హర్యానా బార్డర్ లో ఉన్నారు అంటే తను కచ్చితంగా ఫరీదాబాద్, గురుగ్రామ్ జిల్లాలో ఎక్కడో ఒక చోట ఉంటాడు అని మధు కీ అర్థం అయ్యింది దాంతో వాళ్లు ఢిల్లీ లో ఫ్లయిట్ ల్యాండ్ చేసి గురుగ్రామ్, ఫరీదాబాద్ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ మొత్తం నీ సిద్ధార్థ వెనుక పంపారు కానీ సిద్ధార్థ అంబాలా లో ల్యాండ్ అయ్యాడు అక్కడి నుంచి కాశ్మీర్ వెళ్లాలి అని ప్లాన్ చేశాడు సిద్ధార్థ.
ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ foreign affairs మినిస్టర్ సోఫియా తహసిల్ టేబుల్ మీద సిద్ధార్థ మళ్లీ కనిపించడం ఉన్న video గురించి ఒక ఫైల్ ఉంది అది చూసిన సోఫియా సిద్ధార్థ ఫోటో మీద రెడ్ పెన్ తో సర్కిల్ గీసింది ఇక్కడ ఢిల్లీ లో రమేష్ ఠాకుర్ ఉన్న హాస్పిటల్ లో సడన్ గా బాంబ్ బ్లాస్ట్ జరిగి మొత్తం హాస్పిటల్ నేలమట్టం అయ్యింది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కీ గురి అయ్యారు దాంతో మధు, వినోద్ సిద్ధార్థ గురించి పక్కన పెట్టి రమేష్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెట్టారు రమేష్ చనిపోవడం న్యూస్ లో చూసిన సిద్ధార్థ కీ సంతోషం తో కాలు నేల మీద నిలబడలేదు అప్పుడే కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు సిద్ధార్థ నీ అరెస్ట్ చేశారు తనని అంబాలా నుంచి ఫరీదాబాద్ మధ్యలో ఉన్న అడవి దారిలో తీసుకొని వెళ్లుతున్నారు అప్పుడే ఆ సెక్యూరిటీ అధికారి ఇన్స్పెక్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది దాంతో జీప్ ఆపి సిద్ధార్థ నీ ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ సిద్ధార్థ అందరినీ కొట్టి తనను ఎందుకు చంపాలీ, ఆ అవసరం ఎవరికి ఉంది అని అనుకున్నాడు దాంతో ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ లో వచ్చిన నెంబర్ చూస్తే ప్రైవేట్ నెంబర్ దాంతో ఏమీ క్లూ దొరకలేదు ఇంక సిద్ధార్థ కీ ఒకటే దారి కనిపించింది.
దాంతో మరుసటి రోజు ఉదయం రమేష్ సంతాప సభ నిర్వహించారు అప్పుడు రాష్ట్రపతి, రమేష్ పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నారు అప్పుడు కొత్త తాత్కాలిక ప్రధాని ఎవరిని పెట్టాలని ఇద్దరు చర్చించుకుంటున్నారు అప్పుడే సిద్ధార్థ అక్కడికి వచ్చి అందరి ముందు తన తండ్రి చావు కీ ఎవరూ దిగులు పడవద్దు అని చెప్పారు తన తండ్రి స్థానంలో ఈ దేశం కోసం తను పాటుపడతాననీ మాట ఇచ్చి తనని కొత్త ప్రధానిగా ఎన్నుకోవాలి తన హై కమాండ్ కు చెప్పాడు అప్పటికే తను కోనేసిన కొంతమంది మినిస్టర్ లు సిద్ధార్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సిద్ధార్థ సంతాప సభ నుంచి డైరెక్ట్ గా ప్రధాని ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న తన తండ్రి, తను కలిసి దిగిన ఫోటోలు అన్ని తీసి విసిరేశాడు ఆ తర్వాత వాటిని ఇంట్లో ఉన్న మందు బాటిల్స్ అని ఆ ఫోటోలు పైన పగల గొట్టి తగలబెట్టాడు అప్పుడే వచ్చిన మధు, వినోద్ అది చూసి మధు ఆవేశం గా సిద్ధార్థ మీదకు వెళ్లి లాగి కొట్టాడు “బ్రతికి ఉన్నపుడు ఎలాగో మీ నాన్న కీ నువ్వు గౌరవం ఇవ్వలేదు కనీసం ఇప్పుడయినా గౌరవించురా” అని అరిచి చెప్పాడు, “అవి నా కళ్ల ముందు ఉంటే నాలో ఆవేశం పెరుగుతోంది కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఆవేశం తో కాదు ఆలోచన తో నాన్న చనిపోయిన తర్వాత నన్ను కూడా చంపాలి అని చూశారు మన వెనుక చాలా పెద్ద ప్రమాదం ఉంది అది ఏంటో తెలుసుకోవాలి అంటే నేను prime minister నీ కావాలి అందుకే మన పార్టీ లో ఇప్పటికే నలుగురు మినిస్టర్స్ నీ కొనేశా కానీ ఒకడికి foreign affairs, ఇంకొకడికి central home ministry కావాలి అన్నారు కానీ వాళ్లు ఎద్దవలు కాబట్టి వాళ్లు సీట్లు ఎక్కిన రెండు రోజుల్లో కుర్చీ దిగాలి మన దేశం ముందుకు నడవాలి ఇలాంటి వయసు అయిపోయి పదవుల కోసం ఎగబాకే తోడేలు కాదు కావాల్సింది మన పార్టీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లో నిజాయితీ గా పని చేస్తున్న, ప్రజల మద్దతు ఉన్న యంగ్ లీడర్స్ అందరి లిస్ట్ తీయండి నేను ప్రధాన మంత్రి కాకపోయినా కనీసం వాళ్ల లో ఒకరైన అవ్వాలి అంతే కాకుండా ఇప్పుడు ఉన్న సెంట్రల్ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ ల జాతకాలు అని నాకూ కావాలి వారం రోజుల్లో కాబోయే ప్రధాని నీ announce చేస్తారు కాబట్టి be quick” అని చెప్పాడు సిద్ధార్థ.
సిద్ధార్థ చెప్పింది విన్న తర్వాత మధు, వినోద్ అదే పనిలో ఉన్నారు కాకపోతే సిద్ధార్థ అసలు ప్లాన్ వీల్లకు తెలియదు వాళ్ల నాన్న స్విస్ బ్యాంకుల్లో దాచిన 15,000 కోట్లు లో 1,000 కోట్లు తన తండ్రి బినామీ అకౌంటు లోకి షేర్ చేసి మరుసటి రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు “పిల్లవగానే వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలిసిందే మా నాన్న మన ప్రియతమ నేత రమేష్ ఠాకూర్ గారు దారుణంగా హత్య చేయబడ్డారు దానికి సంబంధించిన విచారణ జరుగుతుందీ కాకపోతే ఆయన చావుకు ఎవరూ కారణం నాకూ తెలియదు కానీ ఆయనను చంపే అవసరం ఏంటో తెలిసింది” అని అంటూ తన బాగ్ లో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసి చూపించాడు సిద్ధార్థ “ఇవి ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేదవారికి ఉచిత వైద్య, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం సూచిస్తు, వారి పూర్తి ఆరోగ్యం తో బయటకు వచ్చే వరకు వాళ్లకు కావాల్సిన కర్చు మొత్తం ఉచితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించేలా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో foreign equipment తో మెరుగైన వైద్యం కోసం ఒక వెయ్యి కోట్లు వరకూ sanction చేశారు ఇది కనుక జరిగితే ఇక్కడ ఉన్న మెడికల్ mafia కీ కష్టం అవుతుంది అని ప్రతిపక్షంలోనో,