శృంగార మధనం – Part 83 54

sex stories in telugu – సరే అత్తా అని తలూపి కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళాను..

మధ్యాహ్నం తినేసి బెడ్ ఎక్కాను పుస్తకాన్ని తీసుకొని..

అహల్య ప్రేమమయపు చూపు రాజసింహుడు పైన పడింది,అదే సమయంలో రాజసింహుడు కూడా ఆరాధనతో అహల్య వైపు చూసాడు..

అలా రెండు రోజులు కర్ణుడు,నక్షత్రుడు ఆ యోధ వంశం దగ్గర గడిపి,భేతాళుడు దగ్గర ఇంకొన్ని కొత్త విద్యలు నేర్చుకొని తమ రాజ్యాలకి వెళ్లిపోయారు సూర్యకీర్తి, రాజసింహుడు లని రమ్మని చెప్పి..

ఇక భేతాళుడు యొక్క కఠోర శిక్షణ మొదలయ్యింది..అహల్యా కూడా రాజసింహుడు యొక్క పురోగతిని గమనిస్తూ ఉండేది.

ఒక నెల రోజులకి సకల విద్యలు రాజసింహుడికి అబ్బేసాయి..భేతాళుడు యమా ఖుషీ అయిపోయి,రాజసింహా నువ్వు నేర్చుకున్న ఈ విద్యలని ఎప్పుడూ దుర్వినియోగం చేయనని నాకు మాటివ్వు అంటూ ఒట్టు వేయించుకున్నాడు…మధ్య మధ్యలో సుధాముడు,సూర్యకీర్తి కూడా సలహాలు ఇవ్వడంతో రాజసింహుడు ఒక అతి బలవంతమైన యోధుడు గా రూపుదిద్దుకున్నాడు..

కండలు తిరిగిన దేహం,చూడగానే ముచ్చటేసే ముఖారవిందం, నూనూగు యవ్వన ప్రాయంలో6అడుగులు ఎత్తు పైనే ఉండి ఒక విగ్రహం లా చురకత్తుల చూపుతో వెలిగిపోతున్నాడు.

(నిజానికి నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడూ అలాగే ఉన్నాను)..

రాజసింహా,నా గురుదక్షిణ ఏమిస్తావ్ మరి?భేతాళుడు అడిగాడు..

చెప్పండి గురువర్యా,మీరేమి అడిగినా నేను కాదనేది లేదు..

వీరుడిలా మాట ఇచ్చావు,మరి మాట తప్పవు గా రాజసింహా?

మాట తప్పితే నా తల తీసేయండి గురువర్యా..

భేతాళుడు ఆనందభాష్పాలు తో,రాజసింహా నా గారాలపట్టి అహల్యా ని వివాహం ఆడుతావని ఆశిస్తున్నాను.ఇదే ఈ గురువు నీ నుండి కోరే ఒక చిన్న సహాయం…

రాజసింహుడు భేతాళుడు పాదాలకి నమస్కరించి, ఈ నీ శిష్యుడు మాట ఇస్తున్నాడు గురువర్యా అహల్యాని అగ్ని సాక్షిగా వివాహం ఆడతాను ఇదే నా మాట..

భేతాళుడు ఖుషీ చెంది,ఇంకొక ముఖ్య విషయం రాజసింహా,మనకు జీవనోపాధి ఇస్తున్న ఈ రేనాటి చోళ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతానని మాటివ్వు..

తప్పకుండా గురువర్యా, నా జీవితం మీరు ఇచ్చిన వరం, మీరేమి ఆదేశించినా నేను కాదనను..

(నాకు ఆశ్చర్యం అధికం అయ్యింది..అదేంటీ ఇప్పుడు నేను సువర్ణ ని ఇంత అమితంగా ప్రేమిస్తుంటే ఈ సివంగి తో నా పెళ్లి నిశ్చయం అయ్యిందేంటి అని ఆలోచనలో పడ్డాను..కాసేపటి ఆలోచన తర్వాత మళ్ళీ పుస్తకంలో లీనం అయ్యాను).

రాజసింహుడి మాట విన్న అహల్య సిగ్గుల మొలక అయింది..రాజసింహుడి మొహంలో సంతోషం వెల్లివిరిసింది..

సుధాముడు,సూర్యకీర్తి రాజసింహుడిని అభినందించారు సంతోషంగా….

అలా వాళ్ళందరి జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తుండగా,భేతాళుడు కి రాజ్యవర్ధనుడు నుండి కబురు వచ్చింది పక్క రాజ్యం “దివిటీ” ల నుండి ఆపద ఉందని..

భేతాళుడు రాజసింహుడిని ,సూర్యకీర్తిని పిలిపించి యోధులారా,మీ విద్యలని ప్రయోగించే అవకాశం మన శత్రురాజ్యం “దివిటీ” ల రూపంలో వచ్చింది.ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా మీ సత్తా చూపించండి అంటూ ఇద్దరినీ పంపించాడు..

వీళ్ళిద్దరూ రాజ్యానికి చేరుకున్నాక కర్ణుడు ఆత్మీయ స్వాగతం పలికాడు.. మహారాజు రాజ్యవర్ధనుడు కి ఇద్దరినీ పరిచయం చేయగా మహారాజు ముగ్గురికీ కర్తవ్య నిర్దేశనం చేసాడు…

మొత్తానికి యుద్ధం రోజు మొదలయ్యింది…దివిటీ మహారాజు చంద్రశేఖరుడు కి మొత్తం 9 మంది ఇతరా సామంత రాజులు మద్దతు పలికి పెద్ద ఎత్తున దండెత్తి వచ్చారు….

ముగ్గురు యోధులూ మెరుపులా కదిలి శత్రు రాజ్యపు సైన్యాన్ని మట్టికరిపించారు.ఆఖరికి చంద్రశేఖరుడు ప్రాణ భిక్ష ప్రసాదించమని అడగగా కర్ణుడు వదిలేసాడు…

ఈ యుద్ధంలో రాజసింహుడి ప్రతిభకు ముచ్చటపడిన రాజ్యవర్ధనుడు తన రాజ్యపు సైన్యాధ్యక్షుడు గా నియమించాడు…

అంత చిన్న వయసులోనే రాజ్యపు సైన్యాధ్యక్షుడు గా నియమితం అయ్యేసరికి అందరూ ఆనందంతో మురిసిపోయారు.. భేతాళుడు ఆనందానికి హద్దులే లేవు..రాజసింహుడు ని మాటలతో పొగిడేసాడు..

దివిటీ ల మహారాజు చంద్రశేఖరుడు ప్రాణ భిక్ష కలగడంతో తన రాజ్యానికి వెళ్లి తీవ్రమైన అవమానంతో మరింత కక్ష ని పెంచుకున్నాడు కర్ణుడు,రాజ్యవర్ధనుడు పైన..10 మంది రాజులము వెళ్తే ఆ కుర్రకుంకల దగ్గర అపజయమా అని తీవ్రంగా అవమానం పొంది ఎలాగైనా ఆ రేనాటి చోళ అంతం చూడాలని అరివీర భయంకరుడైన అజీవిక రాజు పద్మనాభుడు దగ్గరికి వెళ్ళాడు..ఈ పద్మనాభుడు జ్యోతిరాదిత్యుడు యొక్క తండ్రి..

పద్మనాభుడు చంద్రశేఖరుడు చెప్పిన విషయం అంతా విని, చంద్రశేఖరా నేనూ ఆ రాజ్యాన్ని జయించాలి అని నాలుగు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యాను..వాళ్ళకి రక్షణగా యోధ వంశం వాళ్ళు ఇంకా వీరుడైన మట్లి మహారాజు ధనుంజయుడు ఉన్నారు… రేనాటి చోళుల అంతం చూడాలంటే ముందు ఆ ఇద్దరి అంతం చూస్తే సరి లేకుంటే లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు..

అంతలో అటువైపు యువరాజు జ్యోతిరాదిత్యుడు రావడం ఈ విషయాలన్నీ వాడికి చెప్పడం జరిగాయి.. జ్యోతిరాదిత్యుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యి వెంటనే ఆ రేనాటి చోళ సామ్రాజ్యం పైన దండయాత్ర ని ప్రకటించండి వాళ్ళ అంతం నేను చూస్తాను అంటూ ఘీంకరించాడు..

దండయాత్ర విషయం తెలుసుకున్న రాజ్యవర్ధనుడు భేతాళుడు కి కబురు పంపాడు..

భేతాళుడు ,సుధాముడు ఇద్దరూ కలిసి వచ్చి రాజమందిరంలో సమావేశం అయ్యారు…

భేతాళా,ఆ చంద్రశేఖరుడు పెద్ద మోసమే చేసాడు.ఈసారి 18 మంది మహారాజులతో జత కట్టి మన పైకి దండయాత్ర ని ప్రకటించాడు.మన ముందున్న మార్గం ఏంటి సెలవివ్వు…

మహారాజా,ముందుగా మీ బావ అయిన మట్లి మహారాజు ధనుంజయుడు కి అలాగే మీ అక్క వీర వనిత అయిన శ్రీదేవి కి కబురు పెట్టండి ఈ దండయాత్ర విషయం..మిగతాది నేను చూసుకుంటాను..

అలాగే భేతాళా,నేను ఆ పని ని పూర్తి చేస్తాను…గురువర్యా సుధామా మీ ఉపాయం చెప్పండి..

రాజ్యవర్ధనా,ఈ యుద్ధం మిగతవాటిలాగా తేలికగా తీసేయడం మంచిది కాదు,మిగతా రాజుల గురించి పక్కన పెడితే ఇప్పుడు అజీవిక యువరాజు జ్యోతిరాదిత్యుడు బరిలో ఉన్నాడు. అతడు మహా ప్రమాదకారి..తనకి విద్యలు నేర్పిన అనుభవంతో చెప్తున్నాను వాడొక మాయావి,ఏ మాత్రం రెప్పపాటు వేస్తే మన రాజ్యం కకావికలం అవ్వక తప్పదు…

నిజమే రాజగురువా,కానీ మన సైన్యాధ్యక్షుడు రాజసింహుడు అతడిని ఎదిరించే సామర్థ్యం ఉన్నవాడని తెలిసింది,నిజమేనా??

నిజమే కానీ ఈ యుద్ధంలో ఇద్దరిలో ఎవరు తెలివైన వారో వారినే విజయం వరిస్తుంది అన్నది సత్యం..మన రాజసింహుడు మంచితనానికి ప్రతీక అయితే ఆ జ్యోతిరాదిత్యుడు దుష్ట మాయావి…ఇక్కడే మన రాజసింహుడు పొరపాటు పడతాడేమో అన్న సందేహం నన్ను కలిచివేస్తోంది..

గురువర్యా మీరు మదనపడకండి నేను రాజసింహుడు కి కర్తవ్య నిర్దేశనం చేస్తాను అంటూ భేతాళుడు ధైర్యం చెప్పాడు..

అంతలోపు వర్తమానం అందుకున్న కర్ణుడు,రాజసింహుడు, సూర్యకీర్తి సమావేశ మందిరంలోకి వచ్చారు..

భేతాళుడు లేచి రాజసింహా ఎలా ఉన్నావ్ అని ఆలింగనం చేసుకొని,ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి మీ ముగ్గురూ అంటూ మొదలెట్టాడు.

ఆ జ్యోతిరాదిత్యుడు కి ఏ మాత్రం తీసిపోని విద్యలు మీ ముగ్గురిలోనూ ఉన్నాయి..వాడికున్న ఒక్క అదనపు బలం ఏంటంటే కర్ణపిశాచిని విద్య…కర్ణా,సూర్యకీర్తి మీ ఇద్దరూ వాడిని నియంత్రించడం వరకు చేయండి ఇక మిగతా పనిని కర్ణపిశాచిని విద్యలు తెలిసిన రాజసింహుడు చూసుకుంటాడు అని స్పష్టంగా చెప్పాడు..

గురువర్యా నాదొక సందేహం అని రాజసింహుడు అడగగా,ఏంటి రాజసింహా అని భేతాళుడు ప్రశ్నించాడు.

గురువర్యా,ఈ కర్ణపిశాచిని విద్యలు అన్నీ నాకు తెలుసు మరి వాడికి భయపడటం ఎందుకు??

రాజసింహా అక్కడే పొరపాటు పడుతున్నావ్,ఈ విద్య దుష్టుల చేతిలో ఉంటే దానికున్న శక్తి అమోఘం.. నీ మనసు వెన్నతో సమానం..నువ్వు ఆ దుష్టుడి దుష్ట బుద్దిని కలిగిలేవు.ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అయినా దుష్ట ఆలోచన మనసులోకి రానివ్వకు..వాడి కపట నాటకాలని ఒడుపుగా గమనించి ఎదిరించు అది చాలు…

అలాగే గురువర్యా..

సంతోషం…మట్లి రాజుల వారు వచ్చాక మీ సన్నాహాలు మొదలుపెట్టండి అంటూ భేతాళుడు ధైర్యం చెప్పాడు..

కర్ణుడు,రాజసింహుడు,సూర్యకీర్తి వెళ్ళిపోయాక సుధాముడు భేతాళుడు ని వారించాడు ఎందుకు భేతాళా రాజసింహుడు కి అలా అబద్దాలు చెప్పావ్ అని.

గురువర్యా, ఇదొక మహా విపత్తు అని నాకూ తెలుసు అలాగని పోరాడకుండా వదిలేస్తామా చెప్పండి..

నిజమే భేతాళా మన రాజసింహుడు కి ప్రాణాపాయం కదా ఇలా చేస్తే..

నిజమే కానీ మన కర్ణుడు,సూర్యకీర్తి ల బలం తోడైతే విజయాన్ని పొందుతాడన్న నమ్మకం ఉంది గురువర్యా..
అది కాదు భేతాళా,వాళ్ళిద్దరికీ ఆ దుష్టుడి “రాక్షస విద్యలు” తెలియవు గా..

నిజమే గురువర్యా ఆ రాక్షసుడు గుహుడు వల్ల జ్యోతిరాదిత్యుడు కి “రాక్షస విద్యలు ” కూడా సిద్దించాయి..ఆ విద్యలని కొంచెం మన రాజసింహుడికి నేర్పించాను..మీరు ఆందోళన పడకండి..

అలాగే భేతాళా,కానీ ఆందోళన మాత్రం తప్పడం లేదు ఎలా ఈ గండం గట్టెక్కుతారో ఈ యువకులు అని..

అంతా మంచే జరుగుతుంది అని ఆశిద్దాం గురువర్యా.

సరిగ్గా ఒక రోజు తర్వాత ధనుంజయుడు అతని ధర్మపత్ని అయిన శ్రీదేవి ఇద్దరూ వారి సైన్యాల్ని సన్నద్ధం చేసి వచ్చారు..
(ధనుంజయ మహారాజు రూపం నాలో ఆశ్చర్యం అవధులు దాటేలా చేసింది…తను అచ్చు ఏ మాత్రం తేడా లేకుండా నాలాగే ఉన్నాడు నా రూపు తో…)