ఊహిం 727

ఇది చాలా బాధాకరమైన విషయం….అంది..దాంతో ఒక్కసారిగా ఆ వార్త న్యూస్ ఛానల్ లో గుప్పుమంది

మరి కాసేపటి ఆ వార్త ఆ ఛానల్ లోనే కాకుండా అన్ని చానెల్స్ లో పాకిపోయింది..

బ్రేకింగ్ న్యూస్…బ్రేకింగ్ న్యూస్..నిన్న రాత్రి జరిగిన భారీ కారు ప్రమాదం లో..మన ప్రియతమ నాయకుడు..ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజేంద్ర వర్మ గారు దుర్మరణం పాలయ్యారు…

అసలు ఈ కార్ ప్రమాదం ఎలా జరిగింది .
ఇది అసలు ప్రమాదం యేనా, లేదా ఇందులో ఏదన్నా కుట్ర దాగి వుందా.. అంటూ.. XXX ఛానల్ తో పాటు అన్ని టీవీ చానెల్స్ లో..క్షణం తీరిక లేకుండా..
వార్తలు దంచికొడుతున్నారు..
రాష్ట్రం అంతా అట్టుడుకుతోంది
ముఖ్యమంత్రి గారి అభిమానులు..అయన అనుచర వర్గం ఇంటి ముందు గుమి కూడి వున్నారు..
ముఖ్యమంత్రి భార్య అనుష్క..బుజం చుట్టూ చెర కొంగు చుట్టుకుని..దీనం గా ఏడుస్తూ కూర్చుంది..

ముఖ్యమంత్రి బాబాయ్. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు .రఘునాథయ్య అపుడే కార్ లో నుండి దిగి. ముఖ్యమంత్రి పార్థివ దేహానికి..పూల మాల వేసి..ఏడుస్తూ కూర్చున్న అనుష్క దగ్గరకి వెళ్లి ఓదారుస్తున్నాడు
తండ్రి మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కొడుకు..రాజా..రామ్ వర్మ హుటాహుటిన..ఆస్ట్రేలియా నుండి. వచ్చాడు..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. .ఆనందరావు. . .తదుపరి కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు.

అప్పుడే పార్టీ లో కీలక మహిళా నేత అనసూయ.. తన అనుచర వర్గం అయిన 25 మంది ఎమ్మెల్యేలతో తో వచ్చి..
ముఖ్యమంత్రి పార్థివ మృతదేహానికి..పూల మాల వేసి ముఖ్యమంత్రి గురించి..కాసేపు ఉపన్యాసం దంచి..కాబోయే ముఖ్యమంత్రి తానే అన్న రేంజ్ లో..
కాసేపు హడావుడి చేసింది..

ప్రతిపక్ష నాయకుడు..ఇంకా సెంటర్ నుండి పెద్దలు ఇలా ..
ప్రముఖులందరి రాకపోకలు మధ్య..వేలాది అభిమానుల మధ్య రాజేంద్ర వర్మ అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనం గా జరిగింది…

………………………………………………………

రెండు రోజులయ్యాక.. పార్టీ నేతల మధ్య..తదుపరి నాయకుడు ఎవరు అన్న చర్చ మొదలయ్యింది..కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని రచ్చ మొదలయ్యింది..
అందరూ..పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘనాథయ్యని కానీ..ముఖ్యమంత్రి భార్య అనుష్కని ఉండమన్నారు..

అనుష్క..అందరికి నమస్కారం పెట్టి..తనకు రాజకీయాలు కొత్త..అసలే ఆడదాన్ని ఇన్నాళ్లు భర్తే సర్వస్వము అని బ్రతికా ఈ రొంపిలోకి నన్ను లాగొద్దు అని చెప్పింది..

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘునాథయ్య “తనకు వయసు అయిపోయింది ..తన వల్ల కాదు అని.. తన కొడుకు తరువాత కాబోయే ముఖ్యమంత్రి కోసం ఒక నలుగురు ఐదుగురు నాయకులని పరిశీలిస్తున్నాను తర్వాతి ముఖ్యమంత్రిని నా సహాయ సహకారం వంద శాతం ఉంటాయి” అన్నాడు..

ఇంకో పక్క..ప్రతిపక్షం నాయకుడు.వీరేంద్ర ..తన ఎమ్మెల్యే లతో అత్యవసర సమావేశం పెట్టాడు..
“అసలే బొటాబొటి మెజారిటీ ఉన్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి చనిపోయాడు…

ఆ తర్వాత సరైన నాయకుడు లేడు. హోమ్ మినిస్టర్.. ఉప ముఖ్యమంత్రి ..ఎవరికి అంత సీన్ లేదు ప్రజల్లో అంత పాపులారిటీ లేదు….

అధికార పక్షం లో ఉన్న ఎమ్మెల్యే లో కనీసం 20 మందికి మనం గాలం వేస్తే .వాళ్ళని మన వైపుకి తిప్పుకుని ఆ పీఠం మీద .నేనే కూర్చోవచ్చు” ..అని ఎమ్మెల్యే లతో చెప్పి అందరిని ఆ పనిలో వుండండి అన్నాడు

టీవీ చానెల్స్ లో రక రకాల డిబేట్స్ న్యూస్ వస్తున్నాయి..
కాబోయే ముఖ్యమంత్రి…. ఎవరు… ఎవరు …అని..సౌమ్యుడు..అతి మంచి వాడు అయిన ఉప ముఖ్యమంత్రి ఆనందరావు అవుతాడా..లేక..

హోమ్ మినిస్టర్ అవుతాడా లేక మహిళా కోటా కింద పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న అనసూయ కి అవకాశం ఇస్తారా అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి..

ఇంతలో ..పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు..రఘనాథయ్య పార్టీ ఎమ్మెల్యే లు అందరిని..పొద్దు పొద్దునే పార్టీ ఆఫీస్ లో సమావేశానికి రమ్మన్నాడు..

దాంతో అందరిలో ఉత్కంఠ నెలకొని వుంది..సమావేశానికి అందరూ హాజరు అయ్యారు.

సమావేశం మొదలు అయిన కాసేపటికి రఘునాథయ్య కాబోయే కొత్త ముఖ్యమంత్రిగా….చనిపోయిన రాజేంద్ర వర్మ కొడుకు రాజా రామ్ వర్మ ని ప్రకటిస్తున్నట్లు తీర్మానం చేసాడు…

రాజా రామ్ వర్మ పేరు ప్రకటించగానే రాజా..పక్క నుండి..వినయం గా చేతులు కట్టుకుని వచ్చి తాత పక్కన నిలబడ్డాడు..

పార్టీ నేతలు అందరిలో..గుస గుసలు మొదలయ్యాయి..”అదేంటి పెద్దాయన ఆలా ప్రకటించాడు..వున్నట్లుండి ఈ కుర్రాడి పేరు.. ఈ కుర్రాడికి అసలు అనుభవం ఏముంది మన రాష్ట్రం గురించి ఏం తెలుసు”..అనుకుంటున్నారు..