వారసుడు కారాగారం పాలైన బాద తగ్గకనే అతనికి వ్యాపారంలో తేరుకోలేని దెబ్బ తగిలింది. దొంగ సరుకుల రవాణా చేస్తున్నారని అతని చేతివృత్తుల వ్యాపారాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లు మూయించేశారు. పశువులు ఒక్కోక్కటిగా పరలోకం చేరాయి. అతనికి యాభై వచ్చేనాటికి అతనికి మిగిలింది నాలుగు పాడి ఆవులు, అతని కుటుంభం, వూరిలో పలుకుబడి.
చిన్న కూతురికి పెళ్లీడొచ్చింది. పూర్వపు వ్యాపార భాగస్వామి కొడుకుతో పెళ్లి నిశ్చయమైంది. అందుకు డబ్బవసరమైంది. ఎక్కడెక్కడో తిరిగాడు. ఎందరినో అడిగాడు. ఎక్కడా పైసా పుట్టలేదు. చివరగా దొంగతనానికి పూనుకున్నాడు. అదీ కూడా దేవుని గుడి దొంగతనానికి తను చేస్తున్న ఈ నేరం కొడుకు చేసిన హత్యకంటే మహా ఘోరమైనదని తలుచుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతొంది. జీవిత పర్యాంతం నీతికి న్యాయానికి కట్టుబడ్డ బతుకతనిది. అందుకనే దొంగతనం చేయాలంటే అసహ్యం పుడుతొంది. అడవి ఎలుగునే వట్టి చేతులతో మట్టు పెట్టగలిగే ధైర్యం కలిగివున్నా కనీసం కాపలా గూడాలేని గుడిని దొంగలించడానికి ఒణికి పోతున్నాడు.
సమయం అర్దరాత్రిని సమీపిస్తొంది. ఆకాశంలో చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతూ చల్లటి వెన్నెలను వెదజల్లుతున్నాడు. చల్లటిగాని కోనాపురం కోనల్లో వీస్తొంది. ఆ చల్లటి గాలి ప్రభావానికి అతనిలో భయం చచ్చి కాస్త ధైర్యం కూడగట్టుకుంది.
గుండెల్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని లేచినిల్చున్నాడు. వెన్నెల సంద్రంలో తేలుతున్న రంగనాథుని గుడిని చూశాడు. పాలసముద్రంలో పన్నగశయనుడిగా విశ్రాంతి తీసుకుంటున్న అనంతుడిలా అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనం అతని భయాన్ని పటాపంచలు చేసింది. దొంగతనానికి దేవుడి అనుమతే దొరికినంత ధైర్యంగా కొడదిగాడు. ఆలయాన్ని వుత్తర దిశగా సమీపించాడు. అక్కడే క్షేత్రపాలకుడు ఆంజనేయుని మందిరం లోనికి చొరబడి మందిరమంతా కలయ తిరిగాడు. ముహూర్త కాలానికి అతను వెదుకుతున్న మీట ఆంజనేయుని యెడమ పాదం కింద కనబడింది. ఆ మీట నొక్కి భక్తితో పాదం పట్టుకు లాగగానే ఆంజనేయుడు ముందుకి కదిలాడు. ఆయన పాద పద్మాలున్న చోట సొరంగం వెలువడింది. ఆ ఆనందంలో ముందూ వెనక చూసుకోకుండా లోపలికి అడుగేశాడంతే ఎగిరొచ్చి మందిరం వెలుపల పడ్డాడు. కళ్లు బయర్లు కమ్మాయి. అనంత నక్షత్ర కోటీ అతనికి అనుభవం లోకి వచ్చింది. ఆ నక్షత్ర వెలుగులో వుగ్ర రూప బాలాత్రిపుర సుందరి అతని కళ్ల ముందు దర్శనమిచ్చింది. ఆ వుగ్ర రూపం దాల్చిన మరుక్షణం అతను స్పృహ కోల్పోయాడు.

Hii sir,nice story
Upload full story
Hello bro countinue this story