మెమోరీస్ 7 116

రంగ నాథున్ని అతని కుటుంభాన్ని రంగ మహల్లోనే నిర్బందించాడు. అతని భార్యను, వుంపుడు గత్తెలను, వారి పిల్లలను పట్టి తెచ్చారు. చాలా వరకు సైన్యం అతనికి లొంగిపోయింది. లొంగని వారి తలలు నరికించాడు. రామ భద్రుడు కోనాపురానికి పారిపోయాడు.

చంద్రమహల్ నిర్మాణం పూర్తీ కాగానే భవనం మద్యలోని పెద్ద ఖాలీ స్థలంలో పందిరి మంచాన్ని ఏర్పాటు చేయించాడు. దానికి పై భాగాన ఒక అద్దాన్ని అమర్చాడు. రతి సలిపేటప్పుడు ఎదుటి వారి కదలికలను చూస్తే రతి మరింత రంజుగా వుంటుంది. కోరికను పెంచడానికి ఈ ఏర్పాట్ల్లు.

మంచం పక్కనే ఒక ఇనప బోనుని ఏర్పాటు చేయించి రంగనాథున్ని అందులో భందించాడు. అతని వుంపుడు గత్తెలతో రతి జరపడం మొదలెట్టాడు. అతనికి పిశాచ కోరిక ఆ ఆడవారికి తట్టుకోవడం కష్టమైపోయింది. వారి అరిచే అరుపులకి రంగనాథుడు క్రుంగిపోయేవాడు. వారు పడే భాదను చూడలేక చెవులు మూసుకునేవాడు. ఆ ఇనప కడ్డీలకు తలను బాదుకునే వాడు. వూపిరి బిగబట్టి చచ్చిపోవాలనుకునే వాడు. కానీ కుదిరేది కాదు.

రంగనాథునికి ఇరవైకి పైగా వుంపుడు గత్తెలున్నారు. ఒక్కోక్కరితో ఒక రోజు. రతికి తట్టుకోలేక వారు చచ్చిపోతే వారిని తన పిశాచ శక్తులకు ఆహారంగా వేసేవాడు. చివరగా అతని భార్యను మానభంగం చేసే సమయంలో చూడలేక ఏడ్చి ఏడ్చి చనిపోయాడు.

ఒక మద పిశాచానికి ఇంకో పిశాచి వేసిన శిక్ష. ఆ శిక్షకు బలైంది మాత్రం అమాయకపు ఆడవాళ్లు.

పదిహేనేళ్ల రంగనాథుని కుమార్తెతో మాత్రం చంద్రుడు పిశాచంగా ప్రవర్తించలేదు. ఆమెను బుజ్జగించి లాలించి అతని దారికి తెచ్చుకున్నాడు. ఒక అమావస్య రాత్రి తన గురువులందరిని ఆహ్వానించి వారి అనుమతితో ఆమెకు గర్భాధానం చేశాడు. ఆమెను వారితో పాటు రహస్య ప్రాంతానికి పంపేశాడు. ఆమెను వారెక్కడికి తీసుకెళ్లింది ఎవరికి తెలీదు.

వాసుదేవాచార్యుల రెండవ సంతానంగా ఒక కూతురు కలిగింది. అందమైనదే కాక గుణవతి కూడాను. ఆమెకు పువ్వులన్నా వాటిని పెంచడమన్నా చాలా ఇష్టం. తమ భవంతికి పక్కనే వున్న తోటలో అనేక రకాలైన పూల మొక్కలను పెంచింది. పూల మొక్కల లతలను తోరణాలుగా అల్లుకునేలా కర్రలను నాటించింది. ఆ తోటలోని ప్రవేశ మార్గానికి కూడా పచ్చటి తోరణం వుండేది. ప్రవేశ మార్గాని అడ్డంగా వుండే తడకలకు కూడా పచ్చని లతలు అల్లుకుని వుండేటివి.

అటువంటి పూబంతిపై చంద్రుని కన్ను పడింది. ఆమెతో పడక పంచుకోవాలని కోరుకున్నాడు. రంగనాథ పురాన్ని దక్కించుకున్నాక ఒక్కో వూరిని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలెట్టాడు. ఆ అడవి చుట్టూ వున్న యాభై గ్రామాలు అతని ఆదీనంలో వున్నాయి. కోనాపుర రెడ్డి నాయకులు అతనితో సంధి కుదుర్చుకుని అతనికి సన్నిహితులుగా మారారు. వారి ప్రోద్బలం తోనే గోపాల పల్లే మీదకు దండెత్తాలని ప్రయత్నించాడు.

చంద్రునికి వారితో వైరం ఏమాత్రం ఇష్టం లేదు. దైవ శక్తులు కలిగిన వారంటే అతనికి కొంత బెరుకు. తన గురువులకే గురువైన సిద్దప్ప మరణం అతనికి బాగా గుర్తు. ఆ విషయాన్ని ఈరప్ప చెబుతున్నప్పుడు అతని మాటల్లోని భయాన్ని చంద్రుడు బాగా గమనించాడు.అయినా అతను వారి నాశనాన్ని కోరుకున్నాడు.

వాసుదేవాచార్యుని కూతురిని చూడగానే అతన్ని మదం ఆవహించింది. కోపం, భయం పారిపోయాయి. ఆమెను వెంబడించాడు. అడ్డు పడిన కుటుంబ సభ్యులను కడతేర్చాడు. ఆమె భవనం మొత్తం భయంతో పరిగెత్తింది. ఎక్కడా రక్షణ దొరకలేదు. తండ్రి రహస్య మార్గంలో గోవిందాచార్యుల సమాధి వద్దనున్నాడని తెలుసుకుని లోపలికి పరిగెత్తింది.

తన కూతురిని పిశాచి నుండి కాపాడు కోవాలనే ప్రయత్నంలో చంద్రున్ని ఎదుర్కొన్నాడు. ఆ దారుణ పోరాటంలో వాసుదేవాచార్యులు, చంద్రున్ని చంపలేక పోయాడు. తల్లి కడుపున పుట్టిన చంద్రుడు ఎప్పుడో చచ్చి పోయాడు. ఇప్పుడున్నది పిశాచి. మంత్రం భంధమైన శరీరం. దాన్ని చేధించడం వాసుదేవునికి అసాధ్యమైపోయింది.

గోవిందాచార్యుని గ్రంథం చదవగా నేర్చుకొన్న సజీవ మంత్ర సమాధి అనే విద్యను చంద్రునిపై ప్రయోగించాడు. ఆ ప్రయోగానికి అతని శక్తినంతటిని వుపయోగించాల్సి వచ్చింది. స్పటిక లవణం లాంటి ఒక పెద్ద రాతిలో చంద్రుడు ఇరుక్కుపోయాడు. అతని శరీరాన్ని బయటినుండి స్పష్టంగా కనిపడుతుంది. ఆ ప్రయోగం తరవాత వాసుదేవునికి కొన్ని ఘడియలే మిగిలున్నాయని అర్థమైపోయింది. చంద్రున్ని సమాధి చేసిన మందిరాన్ని మూసివేసి మంత్ర భంధము వేశాడు. ఎప్పటికి బయటికి రాకుండా. స్వచ్చమైన కన్య పిల్ల రక్తం మాత్రమే దానిని చేధించ గలుగుతుంది. కానీ దానికంటూ ఒక పద్దతిని అనుసరించాలి.

అప్పటి నుండి ఆ వేణుగోపాల స్వామి పూజారి వంశస్థులకి చంద్రుని శిష్యులకి వైరం ఏర్పడింది. వారి దాడిని తట్టుకోలేక ఆ గుడిని వదిలి వారు వేరే ప్రాంతాలకి వెళ్లిపోయారు. అయినా వదలలేదు. వారి వంశాన్ని కూకటి వేళ్లతో సహా పీకేశాడు. అదృష్టవ శాత్తు ఒక్కడు మాత్రం మిగిలాడు. వాడు ఒక మఠాన్ని ఏర్పాటు చేసి శిష్యులకి శిక్షణ ఇస్తుంటాడు. ఆ శిష్య పరం పరలోని వాడు, గోవిందాచార్యుల వంశం వాడు ఈ ఈశ్వరాచారి. మూలాలని వెతుక్కుంటూ పాతకొటకి వచ్చాడు.

చంద్రుడు చనిపోయిన తరవాత కోనాపుర అడవి గ్రామాలన్నింటిని రెడ్డి నాయకులు వశపరుచుకున్నారు. చంద్రుని శిష్యులకి నాయకత్వం లేక తమ ప్రభావాన్ని కోల్పోయాడు. కానీ అతనితో పాటు శిక్షణ తీసుకున్న అంజయ్య అనే వాడికి మాత్రం చంద్రుడో పిశాచని, వాడికి చావులేదని తెలుసు. అతని జాడని కనిపెట్టే ప్రయత్నంలో పాతకోటంతటిని తవ్వించాడు. జనాలకి తెలిస్తే ప్రమాదమని రహస్యంగానే తవ్వించాడు. అతని చివరి రోజులలో ఇద్దరి శిష్యులకు తనకు తెలిసిన విద్యనంతటిని భోదించి శిష్య పరం పరను కొనసాగించే విధంగా మాట తీసుకున్నాడు.

అది ఇప్పటికీ కొనసాగుతొంది. ఆ శిష్యులకి కన్యల పిచ్చి ప్రతి పదహారు అమావస్యలకి ఒకసారి ఒక కన్యని అనుభవించి గర్బాధానం చేసేవారు. ఎందుకు చేస్తున్నారో ఏమిటో వారికి తెలిసేది కాదు. గురువు చెప్పాడు మేము చేస్తున్నామన్నట్టు వుండేది. ఆ రహస్యాన్ని కొన్ని వందల యేళ్ల తరవాత రామరాజు అనే శిష్యుడు తెలుసుకున్నాడు. అతనే పాతకోటలోని చంద్రుని వునికిని కనుక్కున్నాడు. పాడు పడిపోయిన మంత్రమందిరాన్ని బాగుచేశాడు.

అతని శిష్యుడే నాగ చంద్రుడు. ఒడలిపోయిన శరీరంతో ఒక ముసలి వాడు మంత్ర పఠనం చేస్తుంటే, యజ్ఞ గుండం ముందు దిగంభరంగా కూర్చుని ద్యానం చేస్తున్నాడు. పదిహేను నిమిషాల పాటు మంత్ర పఠనం వుచ్చస్థాయిలో జరిగింది. అతడు వూపిరిని గట్టిగా పీల్చి, వూపిరి బిగబట్టాడు.గాలి స్థంభించి పోయింది. చెట్లు కదలడం ఆపేశాయి. అగ్నిగుండం ఆరిపోతుందనగా వూపిరి వదిలాడు.

“రామ రాజులా నువ్వింకా పకృతిని నీ అధుపులో పెట్టుకోలేక పోయావు” దీనికి ఇంకా సాధన చేయాలి అన్నాడా ముసలి.
“నా ప్రయత్నం నేను చేస్తున్నాను” అన్నాడు నాగ చంద్రుడు.
“ప్రయత్నం కాదు సాధన చేయాలి. దానికి మనసుని లగ్నం చేయాలి”అన్నాడాయన.
“అంటే నేను చేయడం లేదనా నీ వాదన” నాగచంద్రుడు.
“చేస్తున్నావు పాక్షికంగా మాత్రమే, సంపూర్ణంగా మాత్రం కాదు” అన్నాడు “నీ మనసు నీ బిడ్డల చుట్టూ తిరుగుతొంది, దాన్ని అదుపులో వుంచు” అన్నాడు.

ఆ ముసలి దగ్గర సెలవు తీసుకుని మందిరం నుండి బయటకి వచ్చాడు. మూడు కొండ గుహలను దాటి చివరి గుహను చేరుకున్నాడు.
మారుతి అతని స్నేహితులు నాగ చంద్రుని కోసం ఎదురు చూస్తున్నారు.
“ఎమైంది వధువుని సిద్దం చేశారా?” అడిగాడు.
“మన కనుసన్నలలోనే వుంది. పున్నమి తరవాత మొదటి ప్రయత్నం చేస్తాం” అన్నాడు.
ముగ్గురు ఆ గుహలోని రహస్య మార్గాన్ని అనుసరించి రంగమహల్ ని చేరుకున్నారు.

చంద్రమహల్ రహస్యాన్ని కనిపెట్టాడానికి రాజుకు వారం పట్టింది. 18 వ శతాబ్దం మొదట్లో భూస్థాపితమైన ఆ చంద్రమహల్ వున్న ప్రాంతంలో ఇప్పుడు పంట పొలాలు వెలిశాయి.