మెమోరీస్ 8 128

సూరిగాడు పిచ్చి వానిలా డ్రాయింగ్ రూములో అటు ఇటు తిరుగుతున్నాడు. డ్రాయింగ్ రూములో ఒక వైపు బాల్కానీ వుంది. అక్కడ నుంచి చూస్తే ప్యాలెస్ కనపడుతుంది. అది విద్యుత్ దీప కాంతిలో ఇంద్ర భవనంలా వెలిగిపోతొంది. ఆ ప్యాలెస్ పై భాగంలోని సహస్ర ఫణి నివాసమైతే మిల మిలా మెరిసి పోతొంది. ఆ భవనం నుండి మ్యూజిక్ మోత గట్టిగా వినపడుతొంది. సూరిగానికి టీనా గుర్తు వచ్చింది. ఆమె పార్టీ హాలు వదిలి డాక్టరుని ఫాలో అవ్వగానే తాను కూడా ఆమెను వెంటాడబోయాడు కానీ మొదటి అంతస్థులోని సెక్యూరిటీ గార్డు తనని అడ్డుకోగానే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆమె యెక్కడికి వెళ్ళిందో తెలీక తల బరుక్కున్నాడు కొంచేపు. యాడికి పోతుంది యాడికి పోయినా తన రూముకే వస్తుంది కదా అని తను తిరిగి తనకు
ఇచ్చిన గదికి వచ్చాడు. చాలా సేపు యెదురు చూసినా ఆమె రాకపోయే సరికి అతనిలో చాలా వూహలు రేకెత్తినాయి. ఆమెకేమైనా ప్రమాదం జరిగిందా? లేక డాక్టరుతో కలిసి ఎక్కడైన పరుపెక్కిందా? డాక్టరు ఒక్కడేనా ఆయన స్నేహితులు కూడా అతనితో వున్నారా? ఆమె ఒక్కత్తే అంతమందిని తట్టుకోగలదా లేక ఆమెతో పాటు ఇంకెవరైనా ఆడవాళ్లు వుండి వున్నారా?. ఇలాంటి ఆలోచనలు చానా వచ్చినాయి. ఏమిటో ఈ గోల. ఇక్కడంతా గందర గోలంగా వుంది. అసలు తనిక్కడికి రావడమే ఒక విచిత్రం. తను యిక్కడి రావడానికి గల కారణాన్నీ గుర్తు చేసుకోవడం మొదలెట్టాడు.
రాజు, సూరీలు అగ్రహారంలో మారుతి దగ్గర అపహరణకు గురైన వారి ఫోటోలు సంగ్రహించిన తరవాత పాతకోటలో ఒక సమావేశము జరిగెను. అది పగటి పూట జరిగిన సమావేశమున రాజు, సంద్య, పూజారీ, రుక్సానా, శేషుగాడు మరియు రత్నగాడు పాల్గొన్నారు. సూరిగాడు పాల్గొనలేదు. వాళ్లు వాళ్లు చేయవలసిన కార్యక్రమాలు నిర్ణయించుకున్నాక అందరూ విడిపోయారు. ఆనాటి రాత్రి మరొక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గల కారణం సంద్యకి ఆనాటి సాయం సమయాన వచ్చిన వార్తయే కారణం. దాని సారాంశమేమనగా అమావస్య నాటి పూజ వారికి సంతృప్తి నివ్వలేదట. మరుసటి మాసం జరగబోయే పెద్ద పూజకి ఏదైనా అంతరాయం వస్తే పెద్ద ప్రమాదం వస్తుందని వారు ప్రత్యామ్నాయాన్ని ఆలోచన చేశారంట. అందులో భాగంగానే మరో ఇద్దరు ఆడ పిల్లలని అపహరణ చేశారంట. వారు బెంగళూరు నుండి టీనా అను వ్యభిచారిణి సాయంతో వారిని రామలింగా రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారనేది వార్తాంశము. అది తెలిసిన వెంటనే రాజు ఆలోచనలో పడ్డాడు. తాను వనజని వారికి అందకుండా జేసినా వారు ఈ ఇద్దరిలో ఇంకొకరిని వధువుగా ఎంచుకుందురు. అట్ల జరిగినచో వారు విజయవంతులగుదురు. చంద్రుడు బంధము నుండి విముక్తి బొందును. విముక్తి అనంతరం అతనీ లోకంలో జేయు పనే మున్నది. ఈ ఆధునిక లోకమంతా టెక్నాలజీ మయం. ఇక్కడ మాయలు మంత్రాలు నమ్మే వారు లేరు. వీరికి అన్నింటికి రుజువులు కావలెను. మంత్రానికి రుజువేమున్నది. అది సాధనతో సాధించుకోవలసిన విద్య. అది కూడా అర్హులైన వారికే సిద్దించును. అర్హత నిర్ణయించునది గురువు. గురువు అంటే మిడి మిడి జ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించు వాడు కాదు. ఓణామాలు సరిగ్గా రానివాడు కూడా గురువే ఇక్కడ. వానికి కావలసినది ధనం. ఆ వృత్తి చేసినందుకు కాను అతనికి మాసాంతమున ధనం ముట్టుతున్నది. ఇంక విధ్యార్తులు ఎట్లపోతే వానికేమి. వాడు నేర్చినా వాడికేమి నేర్చకున్న వానికేమి. కానీ మంత్రమును భోధించు గురువు విద్యార్థి యొక్క అర్హతను తెలుసుకునే బోధింతురు. రామరాజు తన విద్య నేర్చిన మొదట్లో ఒక శిష్యుని అర్హత నెంచకుండా విద్యను భోధించాడు. అతడు రామరాజుని వంచించడం జరిగింది. అతనిప్పుడు మరొకని చేతిలో కీలు బొమ్మ.
రాజు వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అందులో సూరి కూడా పాల్గొన్నాడు. అతనితో పాటు పూజారీ, సంద్య కూడా. అక్కడ ఎన్నో వాదోప వాదాలు జరిగాయి. సాద్యా సాద్యాలు లెక్కించుకున్నాక వారొక నిర్ణయానికి వచ్చారు. యెట్లైనా మరుసటి మాసంలో జరిగే పూజకి విఘ్నం కలిగించాలని, వారి పూజకి ప్రధానం నర బలి. అందులోను కన్నె పిల్లల బలి. ఇప్పటికే వారు ఎన్నుకున్న ఆడపిల్లలకి రక్షకులుగా మనుషులని నియమించడం జరిగింది. రక్షణ లేని నూతనంగా వారపహరించిన కన్యామణులకే. వారిని కూడా కాపాడలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఆ పని ఎవరు చేయాలనే దానికి మాత్రం ఎవరికీ సమాదానం అంత తొందరగా చిక్కలేదు. రాజుకి వనజని కాపాడే పని వుంది. సంద్య తోట భంగళా వదిలి వెళ్లే పరిస్తితి లేదు. పూజారికి ఈ పని బహు దుర్లభం. ఇంక మిగిలింది సూరిగాడు.
సూరిగాడి విషయం వాదనకు రాగానే రాజు అడ్డుకొనెను. “వాళ్లు రాక్షసులు. వీడు పిల్లోడు లోకం తెలీనోడు. పిల్ల చేష్టలతో వాళ్లని నొప్పించినా వాళ్లు వీనికి ఆపద తలపెడతారు. వానికేమైనా జరిగిందంటే నేనేమైపోదునో నాకే తెలీదు. వాన్ని పంపించడం నాకిష్టం లేదు” అని వాదించెను. సంద్య పూజారీలు అతన్ని పలువిధాల నచ్చజెప్పి ఒప్పించిరి. సూరిగానికి రాజు ఎంత జెప్పితే అంత. అది వారికి తెలియును. వారు రాజుకీ విధంగా నచ్చజెప్పారు. “చూడు నాయనా! అక్కడొక పెద్ద పార్టీ జరుగుతొంది. ఆ పార్టీకి వారికి పెద్ద మొత్తంలో వ్యభిచారులు కావలసి వచ్చినది. నా శిష్యురాల్లలో ఇద్దరు ముగ్గురు ఆ పార్టీకి వ్యభిచారులుగా వెళ్లడం జరుగుతొంది. వారు అక్కడ సూరికి సహాయపడగలరని” పూజారి అనెను. “ఇంక టీనా మేకప్ మ్యాన్ మరియు ఒక బాడీ గార్డు నాకు బాగా తెలుసు. వాళ్లిద్దరే కాకుండా కేశిరెడ్డి గ్యాంగులోని చాలా మంది నా శరీరాన్ని కోరు వారున్నారు. వారికి నా శరీర
ఆశను చూపి నాపక్కకు తిపుకొంటాను. వారి కోరిక తీరే అవకాశం జిక్కాలే గాని సొంత తల్లిని కూడా మోసం జేస్తారు వారు. వారు కూడా సూరికి సాయపడతారు” అని సంద్య అతనికి నచ్చజెప్పింది. అప్పటికి కూడా రాజుకి ఏదో మూల వున్న సందేహం సూరి ఆ పనికి ఒప్పుకోవడంతో దీరిపోయింది.
సూరికి వీడ్కోలు పలుకుతూ తన జేతికి వున్న దారాన్ని సూరికి కట్టాడు. అది పూజారి తన జేతికి కట్టాడు. అది ఎటువంటి ప్రభావం జూపుతుందో రాజుకి కూడా తెలీదు. కానీ ఈ సాహసయాత్రలో వాని తోడు తను వెళ్లడం లేదు. కనీసం ఇదైనా ఇద్దాము దీని వలన ఏదైనా ప్రయోజనం జరిగినా అది తన స్నేహితునికే జరగనీ అనుకొన్నాడు.
సూరిగాడు చేతికున్న దారాన్ని చూడగానే రాజు గుర్తుకు వచ్చాడు. వాడు తనని పంపడానికి ఎంత బయపడ్డాడు. తన చేతనవుతుందో కాదో అని సందేహపడ్డాడు. కాకపోయినా పరవాలేదు ఏదైనా పిచ్చి పని చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడేమో
నని బయపడ్డాడు. సాధారణంగా రాజు దేనికీ బయపడడు. ఒకవేళ భయపడినా అది క్షణాలు మాత్రమే వెంటనే ధైర్యం తెచ్చుకుని అనుకున్న పని సాధించే వరకు విశ్రమించడు వాడు. ఏదైనా పనిని విజయవంతంగా పూర్తీ చేయాలనుకున్నప్పుడు తనకు స్పూర్తి రాజుగాడే. తను వానికి ఎన్నో ప్రమాణాలు చేస్తే గానీ వాడు ఒప్పుకోలేదు. వాటిలో ఒకటి ఎంత కష్టమైనను వారిని తప్పించే పనిని విజయవంతం జేయుదునని, అట్లే ఏమైనను ప్రాణాలతో తిరిగి వత్తునని జెప్పినా వాడు ఒప్పుకోలేదు. వాడికి తన మీదున్న ప్రాణ మట్టిది. అది ఏ జన్మ బంధమో రాజు వంటి స్నేహితుడు దొరికాడు. మునుపు వారి నడుమ ఇంత ఆద్రతా భావం వుండేది కాదు. వున్నకనిపించేది కాదు. ఒకరి ముందు ఒకరు వ్యక్త పరుచుకునే వారు కాదు. ఇప్పుడది బహిర్గతం అయ్యింది. ఈ మూడు వారములలో అది నాల్గింతలు అయ్యింది. ఏది ఏమైనా తన స్నేహితునికిచ్చిన మాట నెరవేర్చవలెను అనే దృడ నిశ్చయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం అతనిలోని అన్ని భయాలు, వూహలు మాయమైపోయాయి.
డ్రాయింగ్ బోర్డు సిద్దం జేసి టీనా చిత్ర పటాన్ని గీయడానికి సిద్దపడ్డాడు. అతను ఆమెలోని సహజ సౌందర్యాన్ని సందర్సించడం మొదలెట్టాడు. సహజ సౌందర్యం అనగా ఆమెలోని ఆడతనాన్ని. ఆడుదానిని పెద్దలు ప్రకృతితో బోల్చారు. ఆమెలోని అంగాలని ప్రకృతిలోని వున్నతమైన వాటితో పోల్చారు. రెండు వక్షాలను కొండలతోనూ, వాటి మద్య భాగాన్ని లోయతోనూ, పృష్ఠ భాగాన్ని పర్వతాల తోనూ, యోని భాగాన్ని నదీ సంగమంతోనూ, దాని నుండి కారే జలాన్ని అమృతం తోనూ పోలుస్తారు. ఆడదంటే ప్రకృతి పకృతంటే ఆడది. అందుకనే ఆమెలో ప్రకృతిని ప్రతిభింభించేలా ఒక చిత్రాన్ని గీశాడు.
అది చూచుటకు మామూలు చిత్రపటంలా ఏదో నాలుగు కొండలను, సెలయేళ్లను గీసినట్లుగా కనిపించుచుండేను. పట్టి చూచినా అందులో టీనా కనిపించును. మామూలు టీనా కాదు ఆమె భావప్రాప్తి పొందినప్పుడు ఆమెలోని ముఖ కవలికలను పచ్చటి పచ్చిక మైదానలతో, ఆమె వక్షాలను కొండల వరసతోనూ, ఆమె శరీర వొంపులను ఆ కొండలలో పుట్టిన నదీ సొంపులతో, ఆమె భావప్రాప్తి పొంది స్కలించే జలాన్ని జలపాతం తోనూ చిత్రించాడు. వాడిలో ఇంత గొప్ప చిత్రకారుడు వున్నాడన్న విషయాన్ని వాడప్పుడే గుర్తించాడు. సంద్య ఎప్పుడో గుర్తించింది. తను గీసిన ఆ చిత్రాన్ని చూసి తానే అబ్బుర పడ్డాడు. ఈ చిత్రాన్ని చూసిన తరవాత టీనా స్పందన ఎలా వుంటుందో అనే వూహతో రాజు నిద్రకుపక్రమించాడు. తన పాత చెలికాడు శరీరం కింద నలిగి అలసిపోయిన టీనా రెండో అంతస్థులోని ఒక గదిలో అతని బాహుబందాల మద్య నిదురిస్తొంది.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *