మెమోరీస్ 10 164

ఆ రోజు శనివారం. చైత్ర మాసము. ద్వాదశి తిది. బడి పిల్లలకు వేసవి సెలవులు. ఇంకొన్ని రోజులలో పదవ తరగతి పరీక్షా పలితాలు వచ్చేస్తాయి.

ఆ పలితాలకు బయపడే ఎంతో మంది పిల్లలు, వారి తల్లితండ్రులు ఆ గుడికి యేతెంచినారు. ఒక అందమైన కన్నె పిల్ల గుడికి పోతాందంటే చాలు, అది ఎంతో అందంగా అలంకరించుకుంటుంది. అందమైన గుడ్డలు దరిస్తుంది. దుస్తుల పైన మెరిసేటి నగలు దరిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగాముద్దుగారే మోమును మరింత ముద్దుగా అలంకరించుకుంటుంది. ఇవన్నీ చేరి కుర్ర హృదయాలను కలత పెట్టి వారి పాలిట గాలెంలా పనిచేసి ఆ కన్నె పిల్లల కులుకులు చూడటానికి ఆత్ర పెడతాయి. అలాంటి కుర్రకారు ఆ గుడికి చేరే దావ పొడుగునా వున్నారు. కొంత మంది మోటారు బైకులలోనూ, మరికొంత మంది సైకెల్లలోనూ వచ్చి దారి తోవ వెంబడి వున్న చెట్ల నీడలలోనూ, చిన్న చిన్న గుండ్ల మీదను కాచుకుని వచ్చిపోయే ఆడవారి వైపు పల్లికలిస్తున్నారు. ఏ జవరాలైనా కనికరించపోతుందా దాని కులుకులు తమ సొంతం కాకపోతాయా అని.
మామూలుగా వుండే రద్దీ కన్నా ఆనాడు రద్దీ మరింత జాస్తీగానే వుంది. రంగు రంగుల చిలకలతో, వాటి కోసమని వచ్చిన గోరింకల గుసగుసలతో, ఆ గుసగుసలను చూసిన చిలకల సిగ్గుల ముసిముసి నవ్వులతో కళకళ లాడిపోతాంది. ఆ గుడికి అర్చకస్వామి రాఘవాచారి. సద్ బ్రాహ్మణుడు. కొన్ని తరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ వంశ ప్రతిష్ట నిలుపుతున్న వ్యక్తి. తన నలుగురి బిడ్డలలో ముగ్గురిని వుద్యోగాల వేటకని గూడు విడవనిచ్చి ఒక్కన్ని మాత్రం తన వంశ వృత్తిని నిలుపుకోవడానికి తన పంచనే వుండనిచ్చాడు. వాడికి వుపనయనం చేసిన కొద్దినాళ్ళకే కర్ణాటక లోని శారదా పీఠం చిన వాసుదేవాచార్యుల వద్ద శిష్యరికానికి వదిలేశాడు. ఈ మద్యనే విద్యాభ్యాసం ముగించుకుని గూటికి వచ్చాడు. గుడిలో తండ్రికి సాయం చేస్తూ వూరి పరిస్తితులను కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటున్నాడు.
అర్చకత్వం నిస్వార్థంగా చేసేటి మాధవసేవ. అది సాధారణ మానవ జీవనానికి కావలసిన ధనాన్ని సంపాదించి పెట్టదు. ఇంత ముందు అంటే రాజుల కాలంలో రాజు యొక్క కోశాగారం నుండి జీతభత్యాలు అందేటివి. దానికి ప్రతిఫలంగా రాజుల పేరన అర్చనలు, ఆశీర్వాదాలు జరిగేటివి. రాజ్యాలు పోయి పాలేగాల్లు వచ్చారు. స్వార్థం కోసం వారు దేవుల్లనే దోచేశారు. ప్రభుత్వాలు వచ్చాక పేరుపొందిన గుడుల పరిస్తితి మెరుగుపడి దేవాదాయశాఖ వారు ఎంతో కొంత జీతం, దేవుని మాన్యాలు పాలేగాళ్ల చెరనుండి విడిపించి దాని మీద వచ్చే ఆధాయాన్ని గుడి బాగోగుల కోసమని వాడుకునే వెసులు బాటు కలిగింది. కానీ ఇలా మారుమూల పల్లెల్లోనూ, అదీ అడివి గ్రామాల్లో వుండే ఇలాంటి గుళ్ల పరిస్తితి మరింత దారుణంగా తయారైంది. ఎన్నో గుళ్లు ఆధరణకు నోచుకోలేక శిథలమై పోయాయి. కొంతమంది క్షుద్ర మాంత్రీకులు నిధుల వేట పేరుతో వాటిని తవ్వి, నేలమాలిగలలోని దేవుని ఆస్తి పాస్తులతో పాటు విలువైన తాళపత్రాలను మాయం చేశారు.
సరిగ్గా ఇరవై అయిదు యేళ్లకిందటి వరకు రంగనాథాలయానిది కూడా అదే పరిస్తితి. రాఘవాచారి తండ్రి రామాచారి జీవితం చివరి అంకంలో వుండి కొడిక్కి తన వృత్తి భాద్యతలను పూర్తిగా రాఘవయ్య మీద వొదిలేసి మంచెం పట్టాడు. అనుభవం లేని రాఘవయ్య శిథిలమై పోతున్న గుడిని వీలైనంత వరకు కాపాడుకుంటూ నెట్టుకొస్తున్నాడు. ఎంతో కొంత బయట ప్రపంచం గురించి తెలిసినోడయుండటం వల్ల ప్రభుత్వానికి గుడి విశిష్టతను, దానికి చుట్టు పక్కనున్న పల్లెల్లో గుడికి వుండే పేరు ప్రతిష్టలను ప్రభుత్వానికి తెలియజెప్పాలని చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతూనే వస్తున్నాయి. కానీ భగీరథ ప్రయత్నాలని మానలేదాయన. మొండి బాపడు. పైగా రంగనాథున్ని నమ్ముకున్న వాడు. దేవుడే తనకు తోడూ నీడ అని నమ్మిన భక్తుడు. ఆయనే ఏదో ఒకటి చేసి ఆయన గూటిని ఆయనే కాచుకుంటాడులే అని సరిపెట్టుకుని నెగ్గుకొస్తున్నాడు.
కార్తీకమాసం. శివునికి,శివభక్తులకు ప్రీతి అయిన మాసం. ఆ మాసంలో ఆ ముక్కంటి గుళ్లన్ని భక్తసముదాయాలతో కలకల లాడుతుంటే విష్ణుమూర్తి గుళ్లన్ని వెలవెల బోతుంటాయి. ఆయినా ఆయనకు నిత్య మంగళారతులు అందుతూనే వుంటాయి. ఆ రోజు కార్తీక శనివారం. భక్తుల తాకిడి సాధారణంగానే వుంది. సాయంత్రం ఎనిమిది గంటల వరకు అడపా దడపా భక్తులు వస్తూనే వున్నారు. వచ్చిన ప్రతి భక్తుడు దైవ దర్శనం చేసుకుని వెళ్లాకే రాఘవాచారి గుడికి తాళం వేశాడు. ఆ రాత్రి ఆయన ఇంటికి వెళ్తుండగా ఎందుకో అడుగు తడబడింది. దూరంగా నక్కల కూతలు వినబడ్డాయి. గుడి మెట్లు దిగుతుంటే వెనకనుండి ఎవరో తోసేసినట్టనిపించింది. ఎదో తెలియని ఒక ఆందోళనతో వడివడిగా ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి రంగనాథుని విగ్రహం ముందు ద్యాన ముద్రలో కూర్చున్నాడు. నాలుగు ఘడియల తరవాత అతనికి నగుమోముతో యమునా నదీ తీరంలో రాధా సమేతుడైన రంగనాథున్నిచూచిన గానీ అతని మనోవ్యాకులత తీరలేదు. అంతా ఆ కృష్ణుని లీలావినోదం అనుకున్నాడు. అప్పటికే అతనికి ముగ్గురు సంతానం ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
శృంగార రాధామాధవుల దర్శనం తరవాత అతని మోము కాంతివంతమైంది. అవ్యక్తభావనలతో పడకగదిని చేరుకున్నాడు. అప్పటికే భార్య పాన్పు సిద్దం చేసివుంచింది. తాంబూలం సిద్దం చేసి మగని రాకకోసమని ఎదురుచూస్తొంది. రాత్రిల్లు అతను భోజనం మితంగా తింటాడు. ఏవైనా నాలుగు పళ్లు, కాసిన్నితినుబండారాలు మాత్రమే అతని భోజనం. చిరునవ్వుతో పడకెక్కిన అతనికి వరుసగా నాలుగు అరటి పళ్లని అందించింది. ఆ నాలుగింటిని చిరునవ్వుతూనే తినేశాడు. గోరువెచ్చటి స్వచ్చమైన గోక్షీరాన్ని సేవించాడు.తమలపాకు, సున్నం, వక్క, కస్తూరి కలిపిన తాంబూలం అతనికి అందించింది. చిరునవ్వుతూనే నములుతున్నాడు.
“ఏమిటోయ్ ఇవ్వాళ అంత ఆనందంగా వున్నావు” అని పలకరిచిందా ఇల్లాలు.
చిరునవ్వుతో ఆ ఇల్లాలి ముఖంలోకి చూస్తూ “రాధామాధవుల దర్శన భాగ్యం కలిగిందోయ్. ఎప్పుడు ప్రార్థించినా అభయహస్తంతో రాక్షస సంహారియై దర్శనమిచ్చే స్వామి ఇవ్వాళ యమునా నదీ తీరంలో రాధాసమేతుడై కనిపించాడోయ్” అన్నాడు. ఆమాటలంటుంటే అతని ముఖం మరింత కాంతివంతమైంది. ఆ ఇల్లాలు ముఖం సిగ్గుతో చిన్నదై పోయింది. అతనింకా రాధామాధవుల దర్శన భ్రమలోనే వుండి మాట్లాడుతుంటే ఆమె అతని వక్షస్థలంపై వాలి కేశాలను తన వేళ్లకు ముడిపెట్టి గట్టిగా లాగింది. “అబ్బా. . . ” అని అరిచి మాయాలోకం లోనుండి బయటపడ్డాడు.

2 Comments

  1. Hii sir,nice story
    Upload full story

  2. Hello bro countinue this story

Comments are closed.