ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది 236

రాజా : మరి నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు

రీతిక : అమెరికా లో ఇప్పుడు అందరూ తిరిగి వస్తూన్నారు కదా నువ్వు ఎలాగో వెళ్లలేవు కాబట్టి ఒక ట్రైల్ వేదాం అని

రాజా : నేను ఏమైన డ్రస్ ఆ ట్రైల్ వేయడానికి

రీతిక : నీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అమ్మాయిలను చూడను కూడా చూడవు అంటా మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వు మా ఫ్యామిలీ కీ కరెక్ట్ అని

ఫ్యామిలీ అనే పదం వినగానే రాజా కీ మళ్లీ కోపం సర్రున పాకింది దాంతో లేచి తన ఛైర్ నీ కాలితో తన్ని “నీకు ఏమైనా పిచ్చా రేపు పెళ్లి అయితే కాపురం చేసేది నువ్వా నీ ఫ్యామిలీ ఆ ఏదో వీళ్ల నాన్న చెప్పాడు అంట ట్రైల్ వేయడానికి వచ్చింది అంట, మీ బాబు వాడికి స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అని చెప్పాడు అని వచ్చావు అంటే నా కారెక్టర్ సర్టిఫికేట్ చెప్పడానికి నీ బాబు చూడాల్సింది నా బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ కాదు నా గూగుల్ హిస్టరీ, అబ్బాయి, అమ్మాయి గురించి పక్కింటి వాళ్ళని, చూట్టాలను అడిగే రోజులు పోయాయి అబ్బాయిలను గూగుల్ హిస్టరీ చూసి, అమ్మాయిలను Instagram స్టోరీలు చూసి సెలెక్ట్ చేసుకున్నే రోజులు వచ్చాయి చెప్పు మీ బాబు కీ నాన్న ఇంకో సారి నాకూ మొగుడిని వెతికే ముందు వాడికి ఏదవ అలవాట్లు ఉన్నాయా లేదా అని కాదు ముందు వాడికి బుర్ర సరిగా ఉందా లేదా అని ఎంక్వయిరీ చెయ్యి అని చెప్పు ” అని కోపంగా అరిచి బిల్ కట్టి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఫ్లాట్ కీ వెళ్లిన తర్వాత తన రూమ్ మేట్ అడిగింది పెళ్లి చూపులు ఎలా అయ్యాయి అని దాంతో రీతిక మొత్తం జరిగింది చెప్పింది “అయిన నేను ఎంతో మంది అబ్బాయిలను కలిశాను కానీ వీడు చాలా డిఫరెంట్ ఉన్నాడు ఒక గంట లో సైకో అర్జున్ రెడ్డి సినిమా నీ యాభై సార్లు చూపించాడు మళ్లీ వాడు నా లైఫ్ లో వాడిని చూడకూడదు అని దేవుడిని గట్టిగా కోరుకుంటున్నా” అని గోడ పైన ఉన్న వెంకటేశ్వర్ల స్వామి కీ దండం పెట్టుకుని వాడి గురించి మరిచి పోవాలి అని అలాగే పడుకుంది, ఇక్కడ రూమ్ కీ వచ్చిన తర్వాత శివ అడిగితే జరిగింది చెప్పాడు రాజా అంతా విన్న తర్వాత “తూ నీకు ఈ జన్మలో పెళ్లి కాదు రా నేను నిన్ను భరించలేనూ కానీ నేను కొన్ని రోజులు ఇంటికి వెళ్లుతున్నా జాగ్రత్తగా ఉండు” అని చెప్పి రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు శివ.

మరుసటి రోజు ఉదయం రాజా వాళ్ల అమ్మ ఫోన్ చేసి “నాన్న జేనాయన చనిపోయాడు నువ్వు ఇంటికి రా” అని చెప్పింది దాంతో చేసేది లేక తన సొంత ఊరు కర్నూల్ కీ వెళ్లాడు అప్పుడు ఇంట్లో చుట్టాలను చూసి అక్కడ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు అని డిసైడ్ అయ్యాడు కానీ దినాలు అయ్యే వరకు ఇళ్లు వదిలి వెళ్లకుడదు అని చెప్పేసరికి ఆగాడు ఆ తర్వాత అందరూ సంవత్సరం లోగా రాజా కీ పెళ్లి చేయాలి అని ఇంక మిగిలిన పిల్లలో వాడు ఒక్కడే అని అందరూ అంటుంటే రాజా కీ చిరాకు వేసి మొత్తం తన బంధువులు అందరినీ పట్టుకుని “ఇక్కడ పెళ్లి చేసుకొని ఏ నా కొడుకు బాగు పడ్డాడు అని నా పెళ్లి మీద పడ్డారు” అని పచ్చిగా అనేశాడు దానికి వాళ్ల నాన్న కోపం తో కొట్టడానికి వస్తే ఆయన చెయ్యి పట్టుకుని “నను కొట్టే అధికారం కన్నందుకు ఉంది కానీ నా లైఫ్ నీ డిసైడ్ చేసే అధికారం నీకు లేదు మొన్న జేనాయన పేరు మీద ఒక స్థలం కొనాలి అని చూసావు గా అది నా పేరు మీద కొన్ను ఆ తర్వాత నెలకు ఎలాగో దాని అమ్ముతారు కదా మీ ఆనవాయితీ ప్రకారం దాంట్లో వాటా నాకూ ఇస్తే పోయి బిజినెస్ పెట్టుకుంటా ” అని చెప్పి తన రూమ్ కీ వెళ్లి పడుకున్నాడు.

ఆ మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ కలిసి ఆ స్థలాన్ని చూడడానికి వెళ్లారు, కాకపోతే ఆ ల్యాండ్ చుట్టూ చాలా litigation లు ఉన్నాయి అన్ని వాళ్లకు తెలియదు, ఇంకో రహాస్యం ఏంటి అంటే రాజా వాళ్ల బావా తన సొంతంగా హాస్పిటల్ కట్టుకోవడానికి తన దగ్గర ఉన్న డబ్బును ఈ ల్యాండ్ కోనడం కోసం పెట్టాడు ఆ తర్వాత అమ్మిన తరువాత తన వాటా కింద మొత్తం డబ్బు తీసుకోవాలని ప్లాన్ చేశాడు దానికి రాజా అమ్మ, నాన్న కూడా రెడీ ఇప్పుడు మధ్యలో రాజా రావడం తో వాళ్లు వాడిని సైడ్ చేయాలి ప్లాన్ చేస్తున్నారు.

ఆ ల్యాండ్ ఓనర్ ఒక ” ఫ్యామిలీ అందులో అందరూ అమ్మాయిలే చేరి ఒక ఎకరం కింద 7 ఎకరాలు సమానంగా పంచుకున్నారు ఇప్పుడు అప్పులు తీర్చుకోడానికి అమ్మకం కీ పెట్టారు అందరూ ఒక మాట మీద ఉంటే ఆ ఊరు సర్పంచ్ రాములురెడ్డి కీ ఈ ” ఫ్యామిలీ లో పెద్ద అమ్మాయి కీ అఫైర్ ఉంది వాడికి ఎప్పటి నుంచో ఆ స్థలం మీద కన్ను ఉంది ఇప్పుడు ఎవరో బయట ఊరు వాడు వచ్చి కొనుక్కుంటే వాడికి మనసు ఆగదు కదా అందుకే ఆ ల్యాండ్ అమ్మకం జరగకుండా ఆపాలని తన ప్లాన్ లో తను ఉన్నాడు.

(గడ్డివేముల కర్నూల్ నుంచి 25 కిమ్ దూరం)

ఆ ఊరి సర్పంచ్ రాములు రెడ్డి ఇంటి చుట్టూ జనం పోగు అయ్యారు ఆ ఊరి చివర ఉన్న ఒక అర ఎకరం భూమి నీ ఒక ముసలి రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అతని స్థలం పక్కనే ఉన్న పోరంబోకు భూమి నీ గవర్నమెంట్ భూమి కింద పట్టాలు తయారు చేసి దాని స్వాధీనం చేసుకున్నాడు యాదవ్ అనే ఆ ఊరి లోని రౌడీ వాడు ఆ పోరంబోకు భూమి నుంచి హద్దులు నీ రోజు రోజుకు జరుపుకుంటు వచ్చి మొత్తం భూమి నాది నువ్వు నాకూ అమ్మేసావు కదా అని ఆ ముసలాయన నీ కొట్టి తరిమేసాడు దాంతో ఆ పెద్దాయన పంచాయతీ నీ ఆశ్రయించాడు కానీ ఊరు మొత్తం కీ తెలిసిన విషయం యాదవ్ రెడ్డి మనిషీ అని యాదవ్ ఏమీ చేసిన వెనుక రెడ్డి హస్తం ఉంటుంది అయిన కూడా పిచ్చి జనం రెడ్డి చెప్పిందే వింటారు, రాములురెడ్డి తన ఇంటి వరండా లో కుర్చీ వేసుకొని సిగరెట్ కాలుస్తూ ఏంటి విషయం అన్నట్టు సైగ చేశాడు దాంతో యాదవ్ “అది కాదు రెడ్డి ఈ పెద్దయ్య బ్యాంక్ లో లోన్ ఉండా అప్ప, అప్పు తీర్చాలా నను ఆదుకో అప్ప అని తన ఆర ఎకరం రాసిచినాడు ఇప్పుడు ఏమో యాలా రాసిచినా అంటానాడు నువ్వే న్యాయం చెప్పాలా” అన్నాడు, దానికి “ఏం పెద్దయ్య ఎంది కథ పోనీలే అని కష్టం లో ఆదుకునేందుకు ఆడు వస్తే ఇట మోసం చేస్తే ఏటా పైగా ఈ ఊరి లో యా గడపకు కటం వచ్చిన ముందు ఉండే యాదవ్ ఆటాంటోడి మీద పంచాయతీ ఎంది అప్ప ” అని ఆ ముసలాయన దే తప్పు అన్నట్టు మాట్లాడి “అయిన స్థలం అమ్మినాక పట్టాలు ఉంటాయి కదా లే, యాదవ సూపి లే ” అన్నాడు రాములురెడ్డి దాంతో యాదవ్ బలవంతంగా ఆ ఊరి బ్యాంక్ మేనేజర్ నీ పిలిపించి అందులో ఆ ముసలాయన వేసిన వేలి ముద్రలు చూపించి అవి లోన్ మొత్తం యాదవ్ క్లియర్ చేసినందుకు అవి యాదవ్ పేరు మీదకు మారాయి అని చూపించాడు, కానీ నిజం ఏమిటి అంటే బ్యాంక్ లో ఆ ముసలాయన తో కొన్ని తెల్ల కాగితం లో వేలి ముద్రలు వేయించి వాటిని మీ సేవ లో రిజిస్టర్ డాక్యుమెంట్ గా మార్పించారు అందుకు బ్యాంక్ మేనేజర్ నీ బలవంతంగా వాడుకున్నారు, “సరే పెద్దయ్య ఏదో తాగేసి డబ్బులు ఖర్చు చేసి ఉండావు ఇదిగో ఈ లేక ఉంచుకో” అని నాలుగు లక్షల స్థలం కీ పదివేలు ఇచ్చి నిర్దాక్షిణ్యం గా ఆ భూమి నీ లాకున్నారు.

ఆ మరుసటి రోజు ఉదయం బ్యాంక్ మేనేజర్ ఆఫీసు కీ వెళుతుంటే దారిలో ఆ ముసలాయన పొలం లో జనాలు కనిపిస్తే వెళ్లి చూశాడు ఆ పెద్దాయన తన పొలం లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అది చూసి చలించి పోయిన మేనేజర్ వెంటనే రెడ్డి ఇంటికి బయలుదేరాడు, అప్పుడే తన ఉంపుడుకత్తె అయిన నూర్ తో బెడ్ రూమ్ లో ఉన్న రెడ్డికి యాదవ్ ఫోన్ చేసాడు “రెడ్డి బెంగళూరు పార్టీ మనం చెప్పిన రేటుకు రావడం లేదు ఏమీ చేయాలా” అని అడిగాడు, దానికి కోపం వచ్చిన రెడ్డి “మెట్టు తోనే కోడత నా కోండే గా యా నా కొడుకు చెప్పుండాడు నీకు స్థలం అమ్మమని రెండు రోజులు ఆగు నేను చెప్తా” అని ఫోన్ పెట్టేసాడు అప్పుడే వచ్చిన మేనేజర్ గట్టిగా రెడ్డి అని అరిచాడు దాంతో బయటకు వచ్చిన రెడ్డి “ఏమైనాది అప్ప ఆటా కేక లేస్తాంటివి” అని సోఫా లో కూర్చుంటు అడిగాడు, “సోలార్ పవర్ ఫ్యాక్టరీ వాళ్లు రోడ్డు వేసేదానికి ముందే పొల్లాలు కొని రోడ్డు పనులు మొదలు పెట్టాలని ఉంటే ఆ దారి మలుపు లో ఈ పెద్దాయన పొలం ఉంది అని కంపెనీ వాడు ముంబాయి వాడు నీకు వాట ఇవ్వడు అని ఈ స్థలం లాకుని దాని వాడికి దారి వేసే తప్పుడు అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఆలోచిస్తున్నావు అని నాకూ తెలుసు, ఈ డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ల స్టాంప్ లేదు ఇది కోర్టు లో ఇస్తే చాలు నువ్వు జైలుకు పోతావు” అని చెప్పి వెనకు తిరగగానే తన ముందు ఉన్న టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ తీసుకోని మేనేజర్ గొంతుకు బిగించి చంపేసాడు.

మరుసటి రోజు ఉదయం సోలార్ ఫ్యాక్టరీ వాచ్ మ్యాన్ సోలార్ ప్లాంట్ గ్రౌండ్లో చెక్ చేయడానికి వెళ్లి తలుపులు తీస్తే మేనేజర్ శవం అక్కడ JCB bulldozer కీ ఉరి వేసి ఉంది దాంతో భయపడి ఓనర్ కీ ఫోన్ చేసే లోపే సెక్యూరిటీ అధికారి లు జనాలు వచ్చారు, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఓనర్స్ కూడా వచ్చారు అప్పుడే రాములురెడ్డి కూడా వచ్చాడు రాగానే యాదవ్ ఓనర్స్ నీ సైడ్ కీ తీసుకుని వెళ్లి కేసు కాకుండా చుసుకుంటాం ఒక 80 కోట్లు ఇచ్చి సెటిల్ చేస్తాం అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే మాట లేకుండా డబ్బు సెటిల్ చేశారు తరువాత కార్ లో కూర్చున్నాక “ఏంది రెడ్డి ఆ మేనేజర్ గాడి శవం నీ నాకూ చెప్పి ఉంటే వెలుగోడు రిజర్వాయర్ లో పడేసి మాయం చేసి ఉండేటోడిని ఈడ ఎందుకు” అని అడిగాడు యాదవ్ దానికి రెడ్డి “ఆ పొలం మనం మహా అయితే 50 లచ్చలకు అమ్మగలం అదే ఇప్పుడు ఇంకో మాట లేకుండా 80 కోట్లు వచ్చుండ్ల” అని చెప్పాడు.

ఆ తర్వాత ఇద్దరూ ఊరి లోకి వెళ్లుతుంటే రాజా ఫ్యామిలీ నూర్ వాళ్ల ల్యాండ్ చూస్తూ ఉన్నారు దాంతో యాదవ్ నీ దిగ్గమని చెప్పడం తో యాదవ్ వెళ్లి నూర్ వాళ్ల మేనమామ జమాల్ భాషా నీ పట్టుకొని “ఏంది భాషా ల్యాండ్ అముతుండారా అయిన రెడ్డి నీ అడిగేది లా ” అని అన్నాడు దానికి రాజా ముందుకు వచ్చి “హలో ఏంది వాళ్లు అమ్ముతునారు మేము కోంటానం మధ్యలో రెడ్డి ఎవ్వురూ అసలు ఇంతకీ నువ్వు ఎవరు” అని అడిగాడు దానికి యాదవ్ “చూడు చిన్న ఈ ఊరి లో ఏమీ జరగాలి అన్న మా రెడ్డి నే చూసుకుంటాడు మళ్లీ కలుదాం ” అని చెప్పి వెళ్లిపోయాడు, అప్పుడే చెర్రీ నుంచి ఫోన్ చేసి “రేయ్ బావ మనం హోటల్ సైట్ కోసం పెట్టిన డబ్బు మొత్తం exchange transaction లో బ్లాక్ అయ్యింది ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు” అని అన్నాడు దానికి రాజా మళ్లీ తన ఫ్యామిలీ వైపు చూసి ఛీ దరిద్రం అని తన ఫోన్ లో selfie తీసుకోని తన మీద తనే తూ అని ఉమ్మేసాడు.

చెర్రీ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత రాజా మొహం లో మారిన మార్పు చూడగానే అర్థం అయ్యింది రాజా చెల్లి లావణ్య కీ వాళ్లకు మూడింది అని దాంతో కావాలి అని కళ్లు తిరిగి పడిపోయింది అప్పుడు తనని హాస్పిటల్ కీ తీసుకుని వెళ్లారు రాజా నీ మందుల కోసం పంపి వాళ్లు సీక్రెట్ గా “ఏమైందే అలా పడిపోయావు” అని అడిగింది వాళ్ల అమ్మ, “అన్నయ్య కీ కోపం వచ్చింది వాడి టార్గెట్ మనమే అందుకే ముందే మనం వీక్ అయితే వాడు కూల్ అవుతాడు అని ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది ఏంటి అమ్మ” అని అడిగింది లావణ్య దాంతో వాళ్ల నాన్న రాజా నీ ఈ ల్యాండ్ సెటిల్ అయ్యే వరకు దూరం పెట్టాలి అని ఆలోచించి వాడిని తిరిగి హైదరాబాద్ పంపాలని అని నిర్ణయం తీసుకున్నారు, కానీ రాజా మాత్రం మరుసటి రోజు మళ్లీ గడ్డివేముల కీ వెళ్లి నూర్ లేని సమయంలో వాళ్ల ఫ్యామిలీ నీ కలిశాడు, నూర్ వాళ్ల నాన్న లేడు అని మిగిలిన అక్క చెల్లెలు అంతా పొలం అమ్మి అప్పులు తీర్చి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కాకపోతే పెద్ద పిల్ల నూర్, వాళ్ల మేనమామ జమాల్ భాషా మాత్రం దాని రెడ్డికి అమ్మి ఎక్కువ వాటా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ల ఆధార్ కార్డు జిరాక్స్ లు ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోని తను అమెరికా వెళితే ఖర్చుల కోసం దాచుకున్న ఐదు లక్షల డబ్బు టోకెన్ అమౌంట్ కింద కట్టి ల్యాండ్ తనకు అమ్ముతున్నారు అన్నట్టు ఒక వెళ్ల మధ్యలో మాట మారిస్తే తను ఇచ్చిన ఐదు లక్షలకు ఇంకో ఐదు లక్షల రూపాయలు కట్టాలి అని తెలివిగా వాళ్లను ఇరికించి పెట్టాడు రాజా, ఇది అంతా తెలివిగా తన ఫ్రెండ్ చెర్రీ వాళ్ల నాన్న రెవెన్యూ ఆఫీసర్ అవ్వడం తో ఆయన సహాయం తో రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టించాడు.