హసీనా అండ్ శృతి 467

ఎలా పాలిస్తావురా బడఁఖోవ్”అన్నాడు పటేల్
“జునాగఢ్ ,హైదరాబాద్ నిజాం నాతో ఉన్నారు , కాశ్మీర్ లో ఎక్కువ జనాభా మాదే ఇవన్నీ కావాలి “అడిగాడు జిన్నా
“అసలు గాంధీ విభజనే వద్దు అన్నాడు మేము ఎందుకులే గొడవ అని ఒప్పుకుంటున్నాము ,నువ్వు అతిగా వెళ్లావనుకో అసలు విభజనే ఉండదు “అన్నాడు పటేల్
“సరే అయితే సంస్థానాలతో మాట్లాడుకుంటాను “అన్నాడు జిన్నా
“మేము కూడా “చెప్పాడు పటేల్
“సరే మా దేశం పేరు పాకిస్థాన్ మీ దేశం పేరు హిందూస్తాన్ అని పెట్టుకోండి “అన్నాడు జిన్నా
“అబ్బో మాకు తెలియదా ,, ఇండియా అనే పేరు చాలు “అన్నాడు నెహ్రు
“పాక్ సైన్యం వెంటనే బోర్డర్స్ లో ఉండాలి “అన్నాడు జిన్నా
‘నాకు అదే కావాలి “చెప్పాడు పటేల్
“ఐబీ ని డివైడ్ చేసి సగం ఇవ్వండి “అన్నాడు జిన్నా
“ముఖం పగులుద్ది ,,నీకు కావాలంటే నువ్వే తయారుచేసుకో “అన్నాడు పటేల్ .

ఈస్ట్ బెంగాల్ ఢాకా కేంద్రం గ ఈస్ట్ పాకిస్తాన్ ప్రొవిన్సియల్ గ ఏర్పడింది .

పరిపాలన మొదలయ్యేక ఇండియా లోకి ఈస్ట్ పాకిస్తాన్ లోకి జనం ఇటు అటు మారటం మొదలు అయ్యింది .
ఈ ప్రాసెస్ లో వెస్ట్ బెంగాల్ లోకి ,నార్త్ ఈస్ట్ లోకి మైగ్రేషన్ బాగా జరిగింది .
1971 :”మేము ఈస్ట్ పాకిస్తాన్ నుండి వచ్చే మైగ్రేషన్ తట్టుకోలేక పోతున్నాము

ప్రపంచ దేశాలు హెల్ప్ చేయండి “అడిగింది ఇండియన్ గవర్నమెంట్
ఎవడు పట్టించుకుంటాడు
ఇండియా యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ ను విడగొట్టేసింది ..
బాంగ్లాదేశ్ కొత్త దేశం గ వచ్చింది
కానీ ……. మైగ్రేషన్ ఇటు అటు ఆగలేదు

“మీరు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నారా ”

“ఎ విషయం “అడిగాడు సతీష్ ముఖర్జీ
ఇద్దరు కోలకతా కి రెండువందల కిలోమీటర్ల దూరం లో ఉన్న సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ స్కూల్ లో ఉన్నారు .
చుట్టూ చాలామంది ఉన్నారు .
అక్కడ పాసింగ్ అవుట్ పెరేడ్ జరుగుతోంది .
“ఒక్క కూతురు చక్కగా బ్యాంకు లోనో లీక్ లోనో చేర్పిస్తే బాగుండేది ,సెక్యూరిటీ అధికారి లో చేర్చారు “అంది ఆమె
“నీకు పిచ్చి ,,చూడు ఈ రోజుల్లో కోరుకున్న ఉద్యోగాలు రావు ,అందులోను గవర్నమెంట్ లో అసలు దొరకవు “అన్నాడు ముఖర్జీ .
పెరేడ్ తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేసారు సెక్యూరిటీ అధికారి లు .
“ఏంటి పెరేడ్ ,ఫంక్షన్ ఎలా ఉంది “అడిగింది శృతి ముఖర్జీ మదర్ ని .
“సర్లే మీ డాడ్ ఆ సంత్రాగచ్చి రైల్వే రిపేర్ వర్క్ చేసి చేసి విసిగించాడు ఖాకి బట్టలతో , ఇప్పుడు నువ్వు “అంది .
“భలే దానివే ఇంతకీ ఎక్కడ ఇచ్చారు జాబ్ “అడిగాడు కూతుర్ని ముఖర్జీ
“అందరికి డీస్పీ లు గ జిల్లా ల్లో ఇచ్చారు ,నన్ను కోలకతా cid కి రిపోర్ట్ ఇవ్వమన్నారు ‘”అంది శృతి
####
రెండో రోజు శృతి కోలకతా cid ఆఫీస్ కి వెళ్లి రిపోర్ట్ చేసింది .
“ఓహో కొత్త డీస్పీ వా “అన్నాడు dig
“అవును సార్ ”
“కొత్త వాళ్ళకి జిల్లా ల్లో ఇస్తారు నిన్ను ఇక్కడ పడేశారేమిటి”అన్నాడు
శృతి మాట్లాడలేదు
నిజానికి ఆమె చదువులో ఇంటెలిజెంట్ కాదు ,పైగా కొన్నాళ్ళు తాత దగ్గర ,కొన్నాళ్ళు హాస్టల్ అంటూ ఆమె చిన్న టౌన్స్ లో చదువుకుంది .
ట్రైనింగ్ లో మామూలుగ్గానే ఉంది ఆమె పెర్ఫార్మెన్స
“కలకత్తా లో ఎక్కడ ఉంటున్నారు “అడిగింది ఎస్ ఐ
“శోభా బజార్ దగ్గర చిన్న ఇల్లు దొరికింది ,,కానీ ఎక్కడైనా ఒకటే ,,హ్యాపీ గ కోలకతా కి మెట్రో ఉంది ,టికెట్ కూడా తక్కువే “అంది శృతి
“అవును ,నలభై ఎల్లా నుండి కోలకతా కి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది అది కూడా రైల్వే వాళ్ళది కాబట్టి తక్కువ ఉంటోంది టికెట్ ,,అదే ప్రైవేట్ మెట్రో అయితేనా”అంది ఎస్ ఐ
“సరిపోయింది పేపర్ చూడట్లేదా ఇండియన్ రైల్వేస్ లో కొన్ని రైళ్లు ప్రవేట్ కి ఇస్తున్నారు “అంది శృతి ఆఫీస్ మొత్తం తిరుగుతూ
“అవునుట ,కానీ ఎందుకో అర్థం కాలేదు మాడం “అంది ఎస్ ఐ
శృతి నవ్వుతు “సింపుల్ బేబీ ,,ఇప్పుడు టికెట్ రేట్ పెంచితే గవర్నమెంట్ ని తిడుతున్నాము ..
అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచుతారు ,,అప్పుడు మనం ఆ కంపెనీ ని తిడతాము ,,గవర్నమెంట్ సేఫ్ గ ఉంటుంది “అంది
“ఓరిని ఇదా కథ “అంది వింతగా చూస్తూ లేడీ ఎస్ ఐ

1 Comment

Comments are closed.