ప్రాజెక్ట్ – Climax 137

మర్నాడు పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశ పెట్టారు పీఎం..”370 కి కాలం చెల్లింది….ఎవరైనా అక్కడ భూమి కొనవచ్చు… వ్యాపారం చేయవచ్చు…ఐపిసి ప్రకారం చట్టం పని చేస్తుంది
లదక్ ను జమ్ము నుండి వేరు చేస్తున్నాము…రెండు ఇక నుండి కేంద్రం కింద యూనియన్ territories గ ఉంటాయి “అని చెప్పారు…
భారతీయ ప్రజా పార్టీ మద్దతు ఇవ్వడం తో 370 రద్దు జరిగింది..
పార్లమెంట్ బయటకు వచ్చి “సౌత్ లో సమస్య, నార్త్ లో సమస్య ఒకేసారి పరిష్కారం అయ్యాయి “అని చెప్పారు పీఎం రామ్ కుమార్…
+++++
అదే సమయంలో తన స్టాఫ్ కి డబ్బు ఇచ్చి థాంక్స్ చెప్పింది రజియా..”ఇక మీరు వెళ్ళొచ్చు”అంది..
సుమతి కి”నువ్వు తారిక్ తో కలిసి సౌందర్య ను కలువు ,నేను చెప్పాను”అంటూ ఇద్దరికీ రెండు బ్యాగ్స్ ఇచ్చింది రజియా..
“ఇంటి తాళం ఒకటి నీ వద్ద ఉంచు “అని ఇచ్చింది సుమతి కి…
బ్యాగ్స్ లో ఉన్న డబ్బు చూసి సుమతి కి , తరిక్ కి అర్ధం అయింది…
సుమతి కార్ లో సౌందర్య ను కలిసింది…ఆమె తో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్ళారు…
“రజియా తప్పుకుంది ,పీఎం ఇంకా పార్లమెంట్ లోనే ఉన్నారు “అంది సుమతి..
“Sorry madam”అన్నాడు తారిక్…
విద్య శర్మ సౌందర్య కు , పీడీ గారికి థాంక్స్ చెప్పి కార్ ఎక్కింది….
ఆ కార్ అరగంట లో పీఎం రెసిడెన్స్ కి చేరుకుంది…విద్య శర్మ ఇంట్లోకి అడుగు పెట్టింది….సంతోషం గా…
“రజియా సుల్తానా ను కలవాలని ఉంది సుమతి”అంది కూర్చుంటూ..
“ఆమె కి మిమ్మల్ని కలవడానికి సిగ్గు గా ఉంది”అంది సుమతి..
గంట తర్వాత వచ్చిన రామ్ కు ఎదురు వెళ్లి గట్టిగ హత్తుకుని ఏడ్చేసింది విద్య శర్మ..
“ఇదేమిటి ఏదో రెండు మూడు నెలలు దూరం గా ఉన్నట్టు “అన్నాడు రామ్..
కాసేపటికి తేరుకున్న విద్య శర్మ జరిగింది మొత్తం చెప్పింది….వింటున్న రామ్ కుమార్ కి వళ్లు జలదరించి “అంటే ఆమె వేరా ,,ఇది దేశ ద్రోహం “అన్నాడు కోపంగా..
“ప్లీజ్ రామ్ ఆమె మీకు ,దేశానికి మంచి చేసింది ,, నాకు ఆమె మీద కోపం లేదు”అంది…కానీ పీఎం తేరుకోవడానికి కొన్ని నెలలు పట్టింది….
++++++
సుమతి కి ఇల్లు అప్పగించాక ముందే సౌందర్య,నేను ఏర్పాటు చేసిన luxury flat లో కి మారింది రజియా..
నేను,సౌందర్య ఆమెని కలిసాము”థాంక్స్ ,బట్ నేను ఇక మి దేశం లో ఉండలేను “అంది రజియా..
“మీలాంటి నటి నీ నేను చూడలేదు…మీరు దేశం నుండి బయటకు వెళ్లడానికి కొంచెం టైమ్ పడుతుంది…మిమ్మల్ని ఎవరు బందించలేదు….మీరు ఫ్రీ గా ఢిల్లీ ఏమిటి.దేశం మొత్తం చూడండి…కాకపోతే స్కార్ఫ్ చుట్టుకొండి “అన్నాను..
+++++
అయితే ఇంతియాజ్ కి తెలియదు…విద్య శర్మ పీఎం వద్దకు వెళ్ళింది అని….రజియా సుల్తానా బయటకి వచ్చేసింది అని….
కొద్ది కాలానికి అజాద్ కాశ్మీర్ ను పాక్ తన దేశం లో కలిపేసుకుంటే ఇండియా మాట్లాడలేదు…
++++++
రక్త పాతం సృష్టించాలని ఇండియా వచ్చిన బాంబ్ షెల్ ,,పూల వర్షం కురిపించింది…
The end…..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.