ప్రాజెక్ట్ – Climax 137

“మనకేమి లాభం”అన్నాడు రామ్.
“ఎలాగూ మనం అక్కడ పోతాము,,మిగిలిన పార్టీ లు కొట్టుకుంటే అదో ఇది”అన్నాడు పార్టీ అధ్యక్షుడు..
“మరి ఆంధ్ర జనం సంగతి ఏమిటి”అంది రజియా..
“మనకెందుకు”అన్నాడు మినిస్టర్ రమే శ్…
+++++
రజియా ఆలోచించి “ok ,, మీరు సైలెంట్ గా ఉంటే కుదరదు “అంది pm తో.
రామ్ “నా దృష్టిలో రాజధాని నీ ప్రకటించాలి”అన్నాడు .
రజియా మాప్ తీసి చూస్తుంటే మిగతా వాళ్ళు కోపం గా చూస్తున్నారు…
“అక్కడ పెద్ద సిటీ వైజాగ్”అంది.
“యస్ అదే కొత్త రాజధాని అవ్వాలి ,పోర్ట్ ఉంది..అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి”అన్నాడు పీఎం.
“Then fix”అందిరజియా..
పార్టీ వాళ్ళు అడ్డం చెప్తున్నా వినకుండా మీడియా ముందుకు వచ్చి “ఏపీ కొత్త రాజధాని వైజాగ్ అని పీఎం చెప్పారు”అంది…

జరుగుతున్న పరిణామాలు సౌందర్య ద్వారా తెలుసు కుంటోంది విద్య..
“ఆమె దక్షిణ భారత దేశంలో పెద్ద సమస్య లో వేలు పెట్టింది “అంది సౌందర్య..
+(((
వైజాగ్ ను రాజధానిగా ప్రకటించగానే ఆంధ్ర ప్రజలు ,నాయకులు అయోమయం లో పడ్డారు,,,కానీ రాయల సీమ లో అలజడి అలాగే ఉంది…
“ఐబీ రిపోర్టు ప్రకారం ఆంధ్ర ప్రజలు కొంత వెనక్కి తగ్గారు “అన్నాడు రామ్..రెండో రోజు రిలీఫ్ గా..
“మీరు ఆంధ్ర కి విద్య,వైద్య సంస్థల్ని ప్రకటించండి”అంది రజియా..
గంట తర్వాత పీఎం మీడియా ముందుకు వచ్చారు..
“ఆంధ్ర కి కొత్త రాజధానిగా వైజాగ్ ఉంటుంది…ఐఐటీ ఆంధ్ర,ఐఐఎం ఆంధ్ర ప్రకటిస్తున్నాను…పోలవరం జాతీయ ప్రాజెక్టు గా ఉంటుంది ..ఎవరు ఖంగారూ పడొద్దు “అని చెప్పారు..
ఆంధ్ర జనాలు క్రమం గా వెనక్కు తగ్గారు,,పార్టీ నాయకులు కూడా సీఎం తో సహా అయోమయం లో పడ్డారు…
“రాయలసీమ కి అన్యాయం చేశారు,,పీఎం,,ఎక్కడో వైజాగ్ మా పరిస్తితి ఏమిటి”అంటూ ఎంపీ లు ,ఎమ్మెల్యే లు ఆందోళన వ్యక్తం చేశారు..జనం కూడా …
++++
మూడు రోజుల తర్వాత మినిస్టర్ రమే శ్ ఇచ్చిన ఫైల్ చూస్తూ “ఆంధ్ర లో పార్టీ ఉంటుంది “అన్నాడు పీఎం…
“కానీ రాయల సీమ జనం కోపం గా ఉన్నారు “అంది రజియా..
“తప్పదు”అన్నాడు చిదంబర రహస్యం గారు..
రజియా ఆలోచిస్తూ “మీరు ఆ ప్రాబ్లెమ్ కూడా సాల్వ్ చేయొచ్చు “అంది .
“హౌ “అన్నాడు పీఎం..
“ముందు ఆంధ్ర కి పార్టీ పరం గా ఒక కమిటీ వేయండి”అంది రజియా..
“అదేమిటి,,,”అన్నాడు రమేష్..
Pm కి రజియా ప్లాన్ అర్థం అయ్యింది….
మళ్లీ మీడియా ముందుకు వచ్చి “ఆంధ్ర తొమ్మిది జిల్లాలకు పార్టీ అధ్యక్షుడు, కార్య వర్గాన్ని ప్రకటిస్తున్నాను”అన్నారు..
“అదేమిటి సార్ ,,రాయలసీమ సంగతి”అన్నారు విలేకర్లు..
“తెలంగాణ,రాయలసీమ రెండు హైదరాబాద్ తో కలిసి ఉంటాయి…కొత్త రాష్ట్రం పేరు హైదరాబాద్ స్టేట్….సో సీఎం గారికి ఏ ప్రాబ్లెమ్ లేదు ఇక”అంది రజియా..
“ఇది అన్యాయం అంటారు ఉద్యమ నాయకులు”అన్నారు విలేకరులు.
“మా పార్టీ లో తమ పార్టీ కలుపుతాము అంటే నమ్మే పిచ్చి వాళ్ళము కాదు ,,, గగన్,బాబు అందరూ ఇప్పుడు ఒక స్టేట్ లో ఉంటారు….Hyderabad state… ఇక ఆంధ్ర లో మా పార్టీ వైజాగ్ ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుంది..”అంది రజియా..
+++++
కాబినెట్ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ద్వారా ఏపీ అసెంబ్లీ కి పంపారు…ఉద్యమ నాయకులు గొడవ చేస్తున్న పట్టించు కోకుండ cm దాన్ని ఆమోదించి పంపాడు.
ప్రెసిడెంట్ బిల్ ను పార్లమెంట్ కు రిఫర్ చేశాడు…ఉద్యమ నేత ల గొడవ పట్టించు కోకుండ పీఎం రామ్ కుమార్ ఉభయ సభల్లో బిల్ అమోదించేల చూసాడు….
మొత్తం పది రోజుల్లో పూర్తి అయ్యింది…
ఉన్న ఎమ్మెల్యే ల్లో ఆంధ్ర ఎమ్మెల్యే లు వైజాగ్ కి వెళ్లి తాత్కాలిక అసెంబ్లీ పెట్టుకున్నారు…
రెండు చోట్ల రామ్ కుమార్ పార్టీ mla లు ఎక్కువగా ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎం లు రామ్ కుమార్ పార్టీ నుండే వచ్చారు…
++++
“సూపర్ కదా”అంది విద్య..
“యస్ మాడం,,, గొడవని తిప్పేసి పీఎం కి చెడ్డ పేరు రాకుండా ,,పార్టీ మునిగి పోకుండా చూసింది ,, గ్రేట్”అన్నాను నేను…
“నేను ఈరోజే వైజాగ్ వెళ్లి వచ్చాను….అక్కడ పరిపాలన మొదలు అయ్యింది….కొన్ని సమస్యలు ఉన్నా సర్దుకుంటాయి…”అంది సౌందర్య కూడా..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.