యుద్ధ నీతి 211

అది 1960 సం.భారత దేశానికి బ్రిటీష్ పాలన ముగిసినా ఇంకా అక్కడక్కడ పోర్చుగీసు వారి పాలనలో కొన్ని ప్రాంతాలు పరాయి పాలనలోనే ఉన్నాయి. స్వతంత్ర్య భారతం వాటిని కూడా చేజిక్కికొనేందుకు వ్యూహాలు పన్నుతూ ఉంటోంది.
అందులో భాగంగా అప్పటి విశాఖ లో నేవీ లో ఉన్న కల్నల్ పాణిని పోండాలో ఉన్న సైన్యాలకు నేతృత్వం వహించాల్సిందిగా కోరుతూ ఉత్తర్వులు రావడంతో కుటుంబం తో సహా పాణి గోమాంతక్ (గోవా) లో ఉన్న పోండా దగ్గరలో ప్రభుత్వ తనకు కేటాయించిన విల్లాలో దిగిపోయాడు. పాణి తెలుగు వాడే ఐనా రాయల్ ఆర్మీ లోనూ ఇంకా ఇతర దేశాల అత్యవసర పరిస్థితుల్లో పని చేసిన విశేషమైన అనుభవంతో ఉన్నవాడు. ఆయనకు తగ్గట్టుగానే ఆయన భార్య మాన్విత వారి ముగ్గురు పిల్లలు అందరూ విల్లాను సర్దుకొని ఎవరి గదుల్లో వారు కుదురుకొంటున్నారు.పాణి ముగ్గురు పిల్లల్లో ముందు ఇద్దరబ్బాయిలు కవల పిల్లలు, హవ్యక్, ధీర్గత్. మూడో సంతానం సుకృత. ముగ్గురు పిల్లలూ వయసుకొస్తున్నారు. 18 ఏళ్ల సుకృతకు అన్నలిద్దరి దగ్గరా మంచి చనువు ఉన్నది.
అబ్బాయిలిద్దరూ అప్పటి బ్రిటీష్ కల్చరును బాగా వంట బట్టించుకొని పెరిగినవారైనా చెల్లెల్ని మాత్రం గారాబంగా చూసుకొనే వారు. ఎంత గారాబం చేసేవారో అంత ఆటపట్టించేవారు. పిల్లల ఆటపాటల్ని చూసి తల్లి తండ్రులిద్దరూ మురిసిపోయేవారు.
ఉప్పొంగిపోతున్న సముద్ర తీరం వెంట కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ తన విల్లాలో నుండి చేతిలో మందు గ్లాసుతో బయట వరండాలోనికొచ్చి టేబల్ మీద కూచొని సిగరెట్ కాలుస్తున్నాడు.
ఇంతలో మాన్విత కూడ ఓ గ్లాసును చేతిలో పట్టుకొని అతనికి కొద్ది దూరంలో కూచొంటూ మన ఊళ్ళో వర్షాకాలంలో వచ్చే మెరుపులూ ఉరుములూ ఇంత ఉదృతంగా ఉండవు కదండీ అంది.
పాణి :- అవును మాన్వి విశాఖ ప్రాంతంలో పిడుగు పాట్లు ఎక్కువే గాని ఇంత దీర్ఘమైన మెరుపులూ ఉరుములూ ఉండవు. ఎందుకంటే నైరుతి ౠతుపవనాలు ముందుగా తాకేది ఈ వైపు నుండే పైగా అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో ఈ ప్రాంతాల్లో ఉండే హ్యుమిడిటీ వల్ల ఈ ప్రాంతాల్లో మెరుపులూ ఉరుములూ ఎక్కువే అని చెప్పవచ్చు. అది సరే కాని పిల్లలు ఈ ప్రాంతం నచ్చినట్లేనా?
మా :-వారికి ఏ ప్రాంతమైనా నచ్చుతుందండీ చిన్నప్పట్నుండి ఈ డిఫెన్స్ వాతావరణంలోనే పెరిగారు కదా . . .తొందరలోనే అలవాటు పడతారు కాకపోతే ఈ అసైన్మెంట్ కొద్దిగా డిఫరెంట్
పాణి :- అవును ఈ సారి నాకు అలాట్ చేసినది కొద్దిగా డిఫ్ఫరెంట్ అసైన్మెంట్. . .డైరెక్ట్ వార్ లాంటిది కాదు. .అంటూ ఏదో చెప్పబోతుండగా
దూరం నుండి చిన్నగా లైట్ వెలుగుతూ ఆరుతూ సిగ్నల్ కనిపిస్తూ ఉండగా దూరం నుండి ఢాం అని పెద్ద శబ్దంతో వెలుతురు ఆరిపోయింది. వర్షానికి అది ఏరకమైన సిగ్నలో అర్థం కాలేదు పాణికి. ఈలోగా గేట్ బయట ఉన్న సిపాయిల్లో ఒకతను ఉరుకుల పరుగులతో లోపలకొచ్చి స్టిఫ్ గా సెల్యూట్ చేసి టెలిగ్రాం చీటీని ఆయన చేతికిచ్చాడు.
అందులో పోర్చుగీసు వారు అడ్వాన్స్ అవుతున్నట్టుగా ఉండడం వల్ల అలర్ట్ గా ఉండమని మెసేజి ఉంది.అది చూసిన పాణి తల పంకిస్తూ సిపాయికి చెప్పాల్సింది చెప్పి పంపేసాడు.
మాన్వితకు ఇవన్నీ మామూలే అందుకే కాం గా మందు తాగుతూ ఉండి సిపాయి వెళ్ళిపోయిన తరువాత పాణి కి ఇంకో పెగ్గు కలిపి ఇస్తూ ఏమిటి విశయం అన్నట్టు చూసింది.
పాణి :- మామూలే జాగ్రత్తగా ఉండమని టెలిగ్రాం . . .అది సరే గాని పిల్లలు పడుకొన్నరా ?
మా :-బహుశా పెద్దాడు నిదురపోయినట్లున్నాడు. సుకృత దీరుతో ఏదో గేం ఆడుతూ ఉన్నట్లుంది. ఏం ? ఎందుకూ. . .
పాణి :- ఈ రోజు ఎందుకో తొందరగానే నిదుర వస్తున్నట్లుంది. స్నానం చేయాలి అంటూ ఒళ్ళు విరుచుకొన్నాడు.
మాన్విత గుంభనంగా నవ్వి , నిదుర వస్తే పడుకొండి స్నానం చేయడం ఎందుకూ ? అందునా వర్షం మరీ ఎక్కువగా ఉంది. జలుబు చేసినా చేస్తుంది.
పాణి :- ఇంటిలో ఉన్నప్పుడు నేనెప్పుడైనా ఒక్కడినే స్నానం చేసానా అందునా ఈ వర్షంలో స్నానం చేయకుండా పడుకొంటే చిరాకుతో అస్సలు నిద్దుర పట్టదు.నీవు కూడా స్నానం చేస్తే ఎంచక్కా హాయిగా ఉంటుంది.
మా :-ఉంటుంది ఉంటుంది. ఈ సముద్ర ప్రాంతాల్లో మీరు ఎందుకు ఎక్కువగా డ్యూటీలు వేయించుకొంటారో నాకు తెలియంది కాదు. స్నానాలు గీనాలేవీ లేవు బుద్దిగా ఆ పెగ్ ఖాళీ చేసి రండి భోజనాలు చేసి పడుకొందాం.. . అంటూ లేవబోయింది నలభైలలొ ఉన్న మాన్విత.

1 Comment

  1. I am all ready read this story at 4 parts upload the remaing story

Comments are closed.