గౌతమి కొడుకు 1573

గౌతమీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం శాలివాహన సామ్రాజ్యం . శ్రీముఖ శాతివాహనుడు తన పదమూడవ ఏట ఉజ్జయినిరాజు విక్రమార్కుడిని ఓడించాడు.
భట్టి మహారాజు తో సహ ఉజ్జయిని మహారాజుని కొన్ని వందల సంవత్సరాల చరిత్రని రూపుమాపి కొంగ్రొత్త శాతవాహన శకాన్నిప్రారంభించారు.
శ్రీముఖ శాలివాహనుడు అది విక్రమశకానికి చరమగీతం పలికింది.కానీ అంత పెద్ద సామ్రాట్టుని ఒక చిన్న దేశ యువకుడు ఎలా ఓడించాడన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం .
ప్రస్తుతం గోదావరి నది పుట్టినిల్లయిన నాసిక త్రయంబకేశ్వరాన్ని అనుకొని శాతివాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది.శివస్వతి తన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీ ముఖుడు సముపార్జించిన విశేష సామ్రాజ్యం ఇప్పుడు దండయాత్రలతో హొరెత్తుతున్నది. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న విక్రమార్కుని వారసులు, అయిన నహపునితో కలగలసి తమ పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నారు.
యవనులు, మ్లేత్యులు, పల్లవులు మొదలైన వారు రాజ్యాన్ని దక్కించుకోవడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.
శివస్వతికి వారసుడు లేడు, వారసులు లేని రాజ్యం మీదే శత్రువులు చూపు రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు.

ఒకరోజు శివస్వతి గోదావరి తీరాన ఉన్న దట్టమైన అడవిలో వేటకు బయలుదేరాడు.
పులిని చూసి దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు.
ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.

ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.
రాజుగారు నేలమీద పడిపోయారు. కళ్ళు బయర్లు కమ్మాయి.వెంటనే ఒక వింత జరిగింది.
చెట్టు పైనుండి ఒక కుర్రాడు సింహం మీద దూకాడు. సింహాన్ని నిలువరించి దాన్ని మచ్చిక చేసుకుని, సింహం మీద ఎక్కాడు.
రాజుగారు తేరుకుని “బాలకా! నీవెవరవు.” అడిగారు.
“నేను ఈ అడవి పుత్రుడుని, నన్ను ఇక్కడ ఉన్న తెగ కు చెందిన వాడిని . మేము జంతువులతో కలిసిమెలిసి ఉంటాము.” అప్పుడు రాజుగారు ఆ తెగ వారిని కలుసుకుని బాలుడు గురించి అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ బాలుడు తమకు అడవిలో దొరికాడని చెప్పారు.
బాలుని చూసి రాజుగారు బాలకా! “నేను నిన్ను యువరాజుని చేస్తాను. నీవు నాతో మన రాజ్యానికి రావలసి ఉంటుంది” అని చెప్పారు.
ఆ తెగవాళ్ళు బాలుడిని ఒప్పించి, రాజుతో పాటు పంపించారు.
ఆ తరువాత ఆ కుర్రాడు రాజు గారితో సింహం ఎక్కి రాజ్యానికి బయలు దేరాడు. అలా ఆ కుర్రాడు సింహ౦ మీద రాజ్యలోనికి రావడంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి భయపడ్డారు.
మహారాణి పేరు గౌతమి . అందంగా ఉన్న బాలుని చూసి ముచ్చటేసింది రాణిగారికి బాలుని గురించి ఆరా తీసి,ఇతన్ని మనంపెంచుకుందాం అంది రాణి.అప్పుడు శివస్వతి బాలుని రాణికి చూపించి యువరాజుకి ఏమి పేరు పెట్టాలని ఆలోచించారు గౌతమీపుత్ర అని పెడదాము, బాలుని జన్మ వృత్తాంతం ఎవరికీ (తర్వాత తరాలకు) తెలియకుండా ఉండాలి. ఎలాగో గోదావరి నదీతీరాన దొరికాడు కాబట్టి గౌతమీపుత్ర అని పెడదాము అన్నారు.
సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాణి

సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాణి.
దత్తత కార్యక్రమము, నామకరణం అయిన తర్వాత అతడిని గౌతమ మహాముని ఆశ్రమానికి(గురుకులం) పంపించారు. గురుకులంలో అన్నీ శాస్త్రాలను ఔపోసన పట్టిన శాతకర్ణి, ఏకసంతాగ్రహి అన్నీ విద్యలను చక్కగా నేర్చుకున్నాడు.