గౌతమి కొడుకు 1578

తురియ స్థితి పొందడానికి శాతకర్ణి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
21వ రోజు రానే వచ్చింది.
శివునికి వెలుగుకి సంబంధమైనది ఏది అని ఆలోచించి చంద్రవంక శివుని తలపై ఉండడాన్ని చూసి, ఆలోచించాడు. చంద్రుని కిరణాలు కొండపైన ఒక చోట పడుతున్నాయి. వాటిని చూసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కొండపైన ఒక ద్వారం తెరుచుకుంది.
కొండలోనికి ఒక దారి ఉన్నది. నాలుగు ద్వారాలు కొండ సొరంగంలోనికి ఉన్నాయి. వాటిని చూశాడు శాతకర్ణి.
మొదటి ద్వారం దగ్గరకు వెళ్ళాలి అంటే నీళ్ళు లోతుగా ఉన్నాయి. ప్రక్కనే బోలెడు అస్థి పంజారాలు ఉన్నాయి ,ఒక పడవ ఉంది ,కర్రతో పడవ నడుపుకుంటూమొదటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ద్వారం బయట ,పెద్ద తాళం ఉంది.కానీ ద్వారానికి తాళం కప్పలేదు ద్వారం రాయితో చేయబడింది కాగడా వెలుతురులో చూస్తే ద్వారం ప్రక్కగా రాయితో చేసిన కప్ప ఉంది.రెండు రాళ్ళ తలుపుల మధ్య తాళం కప్ప ఉంది మధ్యలో చేయి వెళ్ళటం లేదు ఆ రెండు గోడల సందులో చెయ్యి ఎంత వంచినా వెళ్లట్లేదు.పడవలో శాతకర్ణి తురియ సాధన చేశారు. ఒక ఆలోచన వచ్చింది.చేతిని మోచేయి వద్ద విరిచాడు అలా చేయడం వల్ల ఎంతో బాధకు లోనయ్యాడు. ఇంకో చేతితో పట్టుకుని, ఆ సందులో చేతిని దూర్చి తాళం తిప్పగలిగాడు.విపరీతమైన బాధతో ఉన్నాడు శాతకర్ణి. వెంటనే తలుపు తెరుచుకుంది ,వెంటనే మెడలో గుడ్డ వదులుగా కట్టి అందులో విరిగిన చేతిని పెట్టాడు. ఒక చేతితోనే పడవ నడిపాడు. రెండో ద్వారం సమీపించేటప్పటికి నీటిలో అలలు బయలు దేరాయి ,ఎదురుగా సుడిగుండం ఉంది.దాని తప్పించుకోబోయి పడవ తిరగబడిపోయింది.ప్రక్కనే ఉన్న తీగను పట్టుకోబోయాడు .అది నీటి సర్పం ,నాలుక మీద కాటు వేసింది నాలుక పెద్దగా వాచిపోయి ఊపిరి ఆడటంలేదు .వెంటనే శాతకర్ణి ,సాధన చేసి కత్తితో గొంతు మీద గాటు పెట్టాడు .గాలి ఆడింది .వెంటనే తూడు పువ్వు రెమ్మను కత్తిరించాడు .అది గొట్టంలా ఉంది. దానిని గొంతులో పెట్టాడు .గాలి ఆడుతూ ఉంది వెంటనే పెద్ద అరటి ఆకు లాంటి ఆకులు నీటిపై తేలియాడుతున్నాయి . ఓపిక తెచ్చుకుని శాతకర్ణి వాటి పై పడుకున్నాడు .
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దక్షిణామూర్తి పూజారి ఉన్నారు. కాంతి మీద పడి వంటిపై ,చేయిపై గాయాలు మానిపోయాయి. అప్పుడు దక్షణామూర్తి,చెబుతూ, “ నాయనా నీకు రెండు పరీక్షలు పెట్టాను.
మొదటిది నొప్పి మీద భయం పోగొట్టేది .రెండవది ప్రాణం మీద మమకారం పోగొట్టేది చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు చావు గురుంచి భయపడడు.
సాలిగ్రామ నిర్మితమైన అరుణాచల స్వామి ఆలయానికి స్వాగతం.” .ఇంకొక ద్వారం మిగిలింది, ఆ ద్వారం తర్వాత నీకు అరుణాచల స్వామి కటాక్షం కలుగుతుంది “అన్నారు.
అక్కడకు వెళుతుంటే అక్కడ యువరాణి కొలనులో స్నానం చేస్తున్నది.పున్నమి వెలుతురు లో ఆమె మేని ధవళకాంతులీనుతుంది..ఇంకా చెలికత్తెలు కూడా స్నానం చేయుచున్నారు. అందరూ వివస్త్రలు గా ఉన్నారు. అంగనల కుచములు నీటి ప్రభావం వల్ల పెద్దగా అనిపించుచున్నవి .వారి కాళ్ళు నున్నగా పాదరసం వలె నీటి లో కదలాడుచున్నవి . యువతులను చూసిన శాతకర్ణి వారి వద్దకు వెళ్ళాడు. వారిని చూసి బయటకు రండి మీ వెనుక మొసలి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆ అందమైన యువరాణి తన నగ్న శరీరం తో శాతకర్ణి వద్దకు వచ్చినది.
నీటి తో తడిసిన ఆమె శరీరం బంగారు వర్ణం లో మెరిసి పోతూ ఆమె అందాలు రెట్టింపయ్యాయి . అతని అంగము ను స్పృశించి నవ్వుతూ స్పందన లేకపోవుట గమనించి ,నవ్వి అతని ఇంద్రియ నిగ్రహము నకు కారణం ఇతను తురీయా స్థితి సాధించటం అని చెప్పి వెళ్ళిపోయింది.అప్పుడు వెనుక నుండి దక్షిణామూర్తి భళా శాతకర్ణి ,నీవు ఇంద్రియాలను జయించావు తురియ స్థితిని నీవు సాధించావు ,శుక మహర్షి మాత్రమే ఈ స్థితిని పొందగలిగారు .వ్యాసునికి కూడా దక్కని స్థితి నీకు కలిగింది. అంతలో ద్వారం తెరుచుకుంది.
నాలుగు చిరుత పులులు వచ్చి శాతకర్ణి పై పడ్డాయి .ఎదురుగా కత్తి ఉన్నది.కత్తి పట్టుకుని కోపంతో ఉన్న చిరుత పులులు పైకి ఎగిరాడు. శాతకర్ణి ,జంతువులు తన బాల్య మిత్రులు గనుక వాటి మదం అణిచి ఒక చిరుత మీద స్వారీ చేశాడు .