గౌతమి కొడుకు 1578

శాతకర్ణి రాజు వద్ద సెలవు తీసుకుని పిపిరి పర్వతశ్రేణి లోకి పయనమయ్యాడు.
నాగరిక వేషధారణ వదిలేసి శాతకర్ణి ఆ తెగ వద్దకు చేరుకున్నాడు .
సైనికులు ఆ తెగకు కాపలాగా ఉన్నారు.శాతకర్ణి వంటి మీద వస్త్రాలు లేకుండా ఆ తెగ ఉండే చోటు వద్దకు చేరుకున్నాడు. అతనికి అక్కడ దట్టమైన అడవి తప్ప ఏం కనిపించలేదు.తురీయ స్థితి లోనుండి ధ్యానం చేయగా మసక గా ఒక గ్రామం
కనపడింది.ఆ ప్రదేశం ఇంకా స్ప్రష్టంగా కనపడటానికి తురీయాతీత స్థితి కి చేరుకున్నాడు. శాతకర్ణి దివ్య తేజస్సు తో వెలిగిపోతున్నాడు. వేరే కాలప్రమాణం లోఉన్న పిపిరి తెగ వారు శాతకర్ణి తేజస్సు చూసి బాహ్య కాలప్రమాణం లోకి వచ్చి తమ లోకం లోకి తీసుకెళ్లారు.
అప్పుడు అర్ధమైంది శాతకర్ణి కి ఈ రహస్య జీవులు ఎలా మిగిలిన ప్రపంచానికి తెలియకుండా ఉంటున్నారో …..
శాతకర్ణి వారి తెగ నాయకుడైన మాతంగ ధీశుని కలిశారు.

శాతకర్ణి మాతంగా ధీశునితో ఎన్నో సైద్దాంతికపరమైన చర్చలు జరిపారు.
కానీ వారి ఆలయంలోకి మాత్రం రానిచ్చేవారు కాదు.వారి దేవాలయం చాలా విశాలమైనది.ఒక పెద్ద సరస్సులో ఉంది. చాలా పురాతనమైనది. నాలుగు ప్రాకరాలు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవులు, అడవి నుండి దేవాలయానికి కర్రల వంతెన ఉంది.
ఆ ఆలయంలోకి బయట వారికి ప్రవేశం లేదని మాతంగధీశుడు తెలిపాడు.
కొన్ని రోజులకు శాతకర్ణికి తెలిసింది, ప్రతీ నలభై ఒక్క సంవత్సరాలకు ఒక యోగి ఆ దేవాలయానికి వచ్చి అందరికీ ఉపదేశం చేస్తారని ఆయన సంరక్షణలోనే ఈ తెగ ఉన్నదని, ఈ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడేది, ఆ యోగ శక్తి అని చెప్పారు.
ఆ రోజు రానే వచ్చింది.ఆలయం బయట శాతకర్ణి తురీయ స్ధితిలో ఉన్నారు.
యోగి పుంగవుని రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
అంతలో ఒక దివ్యకాంతి పుంజం గుడి బయట ఆవిర్భవించింది.
యోగి పుంగవుడు ఆ కాంతిలోంచి వచ్చారు.ఆయన తురీయాతీత స్ధితిలో ఉన్న శాతకర్ణిని చూసి,అతన్ని యోగ విద్య నుండి లేపి,నాయనా నాతో పాటులోనికి రా అని లోపలికి తీసుకువెళ్ళారు.
యోగితో శాతకర్ణి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయి,యోగికి నమస్కరించారు.అందరూ తమ తమ సందేహాలను యోగిని అడిగి నివృత్తి చేసుకుంటున్నారు.
దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న యోగిని చూసి శాతకర్ణికి నోట మాట రావటంలేదు.
యోగి పుంగవులు అందరికీ ఒక మంత్రం ఉపదేశం చేసాడు.
యోగి చెబుతూ ఈ మంత్రం మనస్సులో అనుకుంటే నేను వారికి ప్రత్యక్షం అవ్వుతాను.కానీ మంత్రం చదివిన వ్యక్తి నాతో ఆత్మశక్తి పంచుకోగలిగిన వాడై ఉండాలి, లేకపోతే తన్ను తాను తెలుసుకున్నవాడై ఉండాలి అని అన్నారు.
వెంటనే మాతాంగుల వారు, యోగిని అడిగారు,స్వామి, ఇతని పేరు శాతకర్ణి,అన్యులకు సాధ్యం కానీ ఈ ఆలయ ప్రవేశం ఇతని కెలా సాధ్యమయ్యింది అని అన్నారు.
అప్పుడు యోగి,ఇతను మహానుభావుడు,చక్రవర్తి అంశతో పుట్టినవాడు. భగవతీ ఆలయంలో సుశిక్షితుడు.అంతకుమించి తురియ,తురీయాతీత స్ధితిని సాధించినవాడు.అతులిత బల సంపన్నుడు. అత్యంత పవిత్రమైన సోమవజ్రాన్ని కలవాడు.
ఇతను రాజసూయ యాగ యోగo ఉన్నవాడు. మీ ఉపదేశం పూర్తి అయినది. శాతకర్ణి తప్ప మిగిలిన వారు, బయటకు వెళ్ళండి అని యోగి చెప్పారు.