నేను బాకీ వుంది ఆయనకే 2 88

“మామయ్య ఎక్కడ?”

“పండరి భజనలు కదా. ఆ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడు.”

వంశీ వెళ్ళిపోయాడు.

రెండోరోజు ఇంకాస్త పొద్దుపోయాక వచ్చాడు. వరండాలో వున్న మంచంమీద కూర్చుని అవీ ఇవీ కబుర్లు ప్రారంభించాడు.

నా నేచర్ తెలిసి ఎవరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు కారు. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మనిషి దొరకడం చాలా రిలీఫ్ గా వుంది. అందుకే అతను చిన్న ప్రశ్న వేసినా సుదీర్ఘమైన జవాబులు చెబుతున్నాను.

ఆ తర్వాత రోజూ రాత్రి ఏడుగంటల ప్రాంతాన మా ఇంటికి వచ్చేవాడు. ఆ టైమ్ కి నా భర్త పండరి భజన నేర్పించడానికి దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. నేనూ, వంశీ ఆరుబయట కుర్చీలో కూర్చుని కబుర్లు వేసుకునేవాళ్ళం. ఏ తొమ్మిందింటికో అతను ఇంటికి వెళ్ళేవాడు.

క్రమంగా నాలో మార్పు రావడం ప్రారంభించింది. మనుషుల మీద ఇంతకు ముందున్న ద్వేషం లేదు. గయ్యాళితనం కాస్తంత తగ్గింది. పనివాళ్ళ మీద కేకలు వేయడం ఎప్పుడో తప్ప చేయడం లేదు. చాడీలు కూడా తగ్గాయి.

మనసులో అంతకు ముందున్నంత గందరగోళం లేదు. ఫ్రస్ట్రేషన్ తో పిచ్చిపట్టినదానిలా ప్రవర్తించే నేను మామూలు మనిషి అయ్యాను. ఇంతకు ముందులా వెర్రిమొర్రి కలలు కూడా రావటం లేదు.

అయితే ఎందుకు నాలో ఇలా మార్పు వచ్చిందో మాత్రం గుర్తించలేదు. నాలోకి నేను తొంగిచూసుకోవడమంటే నాకెప్పుడూ భయమే.

వంశీ చాలా మంచి మనిషి. ఇరవై ఏళ్ళకే అంత బాగా మాట్లాడటం చాలా అరుదు. అతనిలో ముఖ్యంగా నచ్చింది అతని సమయస్పూర్తి. స్పాంటేనియాస్ గా జోక్ లు వేసేవాడు. జీవితంలో అంత చక్కటి హాస్యం వుంటుందని అతని ద్వారానే తెలుసుకున్నాను.

నాతో మాట్లాడే ఆ రెండు గంటల్లో నన్ను ఎన్నోసార్లు నవ్వించేవాడు. అతని కంపెనికన్నా అతని హాస్యానికే ఎక్కువ అడిక్ట్ అయిపోయాను.

ఆరోజు శివరాత్రి, ఉదయమే నిద్రలేస్తూనే తలస్నానం చేశాను, ఆరోజు ఒక్కపొద్దు గనుక టిఫిన్ ఏమీ చేయకుండా ఏకంగా భోజనం చేయాలి కాబట్టి ఆ పనిలో పడ్డాను. వడలూ, పాయసం, అవినాకూ తాళింపూ, సాంబారూ, కొబ్బరిచట్నీ ఇలా రకరకాల వంటలు చేయడంతో మధ్యాహ్నం రెండయ్యింది. నేనూ, నా భర్తా భోజనాలు ముగించాం. అలా నడుము వాల్చి లేచేసరికి నాలగయ్యింది.

మధ్యాహ్నం వంటకాలే చాలా మిగిలాయి గనుక రాత్రి వాటితోనే అడ్జస్టయిపోదామనుకున్నాను. అంతలో సుగుణా, మమతా వచ్చి గుడికి వెళదామని పిలిచారు. నాలో మార్పు వచ్చినప్పట్నుంచీ మా ఇంటికి ఒక్కొక్కరే రావడం ప్రారంభిస్తున్నారు.

1 Comment

  1. మంచి కధగా చాలా బాగా వ్రాసారు.
    Keep it up sir.

Comments are closed.